Home » కరీంనగర్ లో తీగ లాగితే విదేశాలలో డొంక కదిలింది.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి..!

కరీంనగర్ లో తీగ లాగితే విదేశాలలో డొంక కదిలింది.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి..!

by Anji
Ad

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్స్ పేపర్ మొదలు గ్రూపు 1 వరకు పలు కీలక పరీక్షలకు సంబంధించి ప్రశ్న పత్రాలు లీక్ అయినట్టు గుర్తించారు అధికారులు. దీంతో పలు పరీక్షలను రద్దు చేస్తూ.. టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పోలీసులు కేసును విచారిస్తున్నారు. మొత్తం 9 మంది నిందితులను విచారిస్తున్నారు.  

Also Read :  తెలంగాణలో గ్రూపు 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు..!

Advertisement

సిట్ అధికారుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రూపు 1 పేపర్ ని రాజశేఖర్ చాలా మందికి అమ్ముకున్నట్టు సిట్ అనుమానం వ్యక్తం చేసింది. గ్రూపు 1 రాసిన వారిలో విదేశాల నుంచి ఇద్దరూ ఉన్నట్టు అధికారులు గుర్తించారు.  వీరిని కూడా విచారించేందుకు సిట్ సిద్ధమవుతోంది. అక్టోబర్ నుంచే పేపర్ లీక్ అయినట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ కి చెందిన ఆరుగురికి రాజశేఖర్ గ్రూపు 1 పేపర్ ఇచ్చినట్టు సమాచారం. నలుగురు ఎన్ఆర్ఐలతో పాటు మరో ఇద్దరు స్థానికులు కూడా గ్రూపు 1 పరీక్షలు రాసినట్టు గుర్తించారు అధికారులు.  

Advertisement

Also Read :   జై చిరంజీవ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…!

గ్రూపు 1 పరీక్షలు రాసేందుకు నలుగురు ఎన్ఆర్ఐలు విదేశాల నుంచి వచ్చారు. పేపర్ అమ్మడం ద్వారా వచ్చినటువంటి డబ్బును రాజశేఖర్ స్నేహితులు, బంధువుల అకౌంట్ లో జమ చేశాడు. దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నారు. ఇదిలా ఉండగా.. టీఎస్పీఎస్సీ అక్టోబర్ తరువాత 7 పరీక్షలను నిర్వహించింది. దీంతో ఈ 7 పరీక్షలలో టాప్ మార్క్స్ సాధించిన 500 మంది జాబితాను సిద్ధం చేసింది. వీరిని విచారించనున్నటట్టు తెలుస్తోంది.  

Also  Read :  భార్య కంటే భ‌ర్త వ‌య‌సులో ఎందుకు పెద్ద‌వాడై ఉండాలి..? శాస్త్రం ఏం చెబుతుందంటే..?

Visitors Are Also Reading