Home » 50 ఏళ్ల వ‌య‌సులో గ‌ర్భందాల్చిన మ‌హిళ‌…విష‌యం తెలిసిన 24 ఏళ్ల కూతురు ఏం చేసిందంటే..?

50 ఏళ్ల వ‌య‌సులో గ‌ర్భందాల్చిన మ‌హిళ‌…విష‌యం తెలిసిన 24 ఏళ్ల కూతురు ఏం చేసిందంటే..?

by AJAY
Ad

కేర‌ళ ఆర్య 23 అనే యువ‌తి సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఆర్య త‌న త‌ల్లి దీప్తి ప్రెగ్నెంట్ అంటూ పోస్ట్ లో పేర్కొంది. దాంతో అంతా షాక్ అవుతున్నారు. దానికి కార‌ణం ఆర్య వ‌య‌సు 23 ఏళ్లు కాగా ఆమె త‌ల్లి వ‌య‌సు 50 ఏళ్లు కావ‌డ‌మే. అయితే ఈ విష‌యం విన్న త‌ర‌వాత ఎవ‌రైనా… ఇంట్లో అంత‌ పెద్ద కూతురును పెట్టుకుని మ‌ళ్లీ పిల్ల‌ల‌ను కంటారా అంటూ ఇరుగుపొరుగు వాళ్లు కామెంట్ చేస్తార‌న్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

దాంతో ఆర్య త‌న త‌ల్లి ప్రెగ్నెంట్ అనే విష‌యం చెబుతూనే అలా అనేవారికి త‌న‌దైన స్టైల్ లో స‌మాధానం చెప్పింది. త‌న పేరెంట్స్ మొద‌ట ఫోన్ చేసి నీ దగ్గ‌ర ఓ నిజం దాచిపెట్టామ‌ని ఏడ్చేశార‌ని తెలిపింది. కానీ వాళ్లు విష‌యం చెప్పిన త‌రవాత చాలా సంతోపడ్డానని పేర్కొంది. తాను పుట్ట‌బోయే బిడ్డ‌ను ఓ త‌ల్లి మ‌రియు అక్క‌లా చూసుకుంటాన‌ని తెలిపింది.

ALSO READ : కోట్లు సంపాదించవ్చని ఆశ చూపిన యువతి.. ఇక ఏం చేసిందంటే..?

Advertisement

చిన్నప్పుడు త‌న‌కు ఓ త‌మ్ముడో చెల్లెలో ఉంటే బాగుంటుంద‌ని అనుకునేదాన్ని అని ఇప్పుడు అది నిజం కాబోతున్నందుకు సంతోషంగా ఉంద‌ని చెప్పింది. ఇదిలా ఉండగా ఆర్య త‌ల్లి దీప్తి మాట్లాడుతూ….తాను ప్రెగ్నెంట్ అనే విష‌యం త‌న‌కు త్వ‌ర‌గా తెలియ‌లేద‌ని చెప్పింది. అది తెలియ‌కుండానే చాలా ప్ర‌యాణాలు చేశాన‌ని చెప్పింది.

కొన్నిసార్లు క‌డుపునొప్పివ‌చ్చిందని చెప్పింది. కానీ ఒక‌రోజు అనుమానం రావ‌డంతో ఆస్ప‌త్రికి వెళ్లగా వాళ్లు అస‌లు విష‌యం చెప్పారని వెల్ల‌డించింది. అప్ప‌టికే 5వ నెల అని డాక్ట‌ర్ లు చెప్పార‌ని పేర్కొంది. మొద‌టిసారి ఆర్య కు ఫోన్ చేసిన‌ప్పుడు త‌న‌కు 8వ నెల అని చెప్పింది. అప్పుడు చాలా బాధ‌ప‌డ్డామ‌ని తెలిపింది.

ALSO READ : ఆ రెండు కారణాల వల్లనే బాలకృష్ణ ‘నిప్పురవ్వ’ నిరాశ మిగిల్చిందా ?

Visitors Are Also Reading