Home » కేజీఎఫ్ చిత్ర నిర్మాణ బ్యానర్ లో మహానటి.. నెటిజన్లు ఏమంటున్నారంటే?

కేజీఎఫ్ చిత్ర నిర్మాణ బ్యానర్ లో మహానటి.. నెటిజన్లు ఏమంటున్నారంటే?

by Anji
Ad

కేజీఎఫ్ సినిమాల తరువాత సినీ పరిశ్రమలో హోంబలే ఫిల్మ్స్ పేరు మారు మ్రోగుతోంది. దక్షిణాది భాషల చిత్రనిర్మాణం చేపడుతామని అధికారికంగా ప్రకటించిన ఆ సంస్థ అధినేత విజయ్ కిరగందుర్ ఇప్పటికే టాలీవుడ్ లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం సలార్. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. పాన్ ఇండియా సినిమా విడుదల కాబోతుంది. ఇక ఈ సంస్థ కోలీవుడ్ లో కూడా సినిమాలు చేయడానికి సిద్ధమవుతోంది.

Advertisement

ఇదిలా ఉండగా..  ఎన్నో సంచలనాలు నమోదు చేసిన కేజీఎఫ్ సినిమా నిర్మాణ సంస్థ అయినటువంటి హోంబలే ఫిల్మ్స్  బ్యానర్ లో  మహానటి కీర్తి సురేష్  ఓ సినిమాలో నటించనున్నట్టు సమాచారం.  ఇప్పటికే సూరరై పోట్రు చిత్రం ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందులో శింబు కథానాయకుడిగా నటించనున్నట్టు ప్రచారం కొనసాగుతుంది. తాజాగా ఈ సంస్థలో నటి కీర్తి సురేష్ కథానాయికగా నటించబోతున్నట్టు మరో వార్త ప్రచారం అవుతోంది. హీరోయిన్ ఓరియెంటేడ్ కథా అని సమాచారం. తాజాగా ఈ సినిమాను అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది. 

Advertisement

Also Read :  సమంత కొరియా నుంచి తిరిగివచ్చిన తరువాత నాగచైతన్యను కలువనుందా ? 

nnee

ఇక సినిమాకు దర్శకుడు ఎవరు ? అనే వివరాలను ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం నటి కీర్తి సురేష్ చేతిలో తెలుగులో చిరంజీవికి జంటగా నటిస్తున్న బోలా శంకర్, తమిళంలో జయం రవి సరసన నటిస్తున్న సైరన్ వంటి చిత్రాలు ఉన్నాయి. మరోవైపు ఇటీవలే కీర్తి సురేష్ తన నటనకు గుడ్ బై చెప్పేసిందని, పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుందనే వార్తలు గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో కీర్తి సురేష్ నటిస్తుందా లేదా అనేది వేచి చూడాలి మరి.

Also Read :  ఆర్ఆర్ఆర్ వాళ్లకు ఎందుకు నచ్చిందో తెలియదు.. రాజమౌళి వ్యాఖ్యలు వింటే ఆశ్చర్యపోవడం పక్కా..!

Visitors Are Also Reading