Home » యోగి అడ్డాలో కేసీఆర్ ప్లెక్సీ….ఇదెక్కడి ఫాలోయింగ్ మావా…!

యోగి అడ్డాలో కేసీఆర్ ప్లెక్సీ….ఇదెక్కడి ఫాలోయింగ్ మావా…!

by AJAY
Published: Last Updated on
Ad

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆనారోగ్యం భారిన పడిన సంగతి తెలిసిందే. దాంతో యశోదా ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. ఎడమ చేయి లాగుతుంది అని కేసీఆర్ తెలపగా డాక్టర్ లు ఆయనకు అన్ని రకాల పరీక్షలు చేశారు. అనంతరం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని అయితే ఆయనకు విశ్రాంతి అవసరం అని వెల్లడించారు. ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ ఆనారోగ్యం బారిన పడిన వెంటనే త్వరగా కోలుకోవాలని ఓ అభిమాని భారీ ప్లెక్సీ ని ఏర్పాటు చేశారు.

Advertisement

Advertisement

ఆ ప్లెక్సీ ని తెలంగాణ లో ఏర్పాటు చేస్తే ఎవరూ పట్టించుకునేవారు కాదు కానీ కేసీఆర్ అభిమాని సాయి యోగి అడ్డా…. బిజేపి పాలిత రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసిలో పెట్టించారు. గంగా నది లోని బోట్లలో దేశ్ కా నేత అంటూ కేసీఆర్ ఫోటోలను వేయించారు. ఇక కేసీఆర్ తో పాటు కెటిఆర్ మరియు ముఖ్యనాయకుల ఫోటోలను ప్లెక్సీ లో ఏర్పాటు చేశారు. అంతే కాకుండా కేసీఆర్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని సాయి కాశీ విశ్వనాథుడిని పూజిస్తున్నట్టు వెల్లడించారు.

Visitors Are Also Reading