Home » అందర్నీ వదిలేసి నన్నే ఎందుకు పట్టుకున్నారు….ట్రైలర్స్ పై కరణ్ జోహార్…!

అందర్నీ వదిలేసి నన్నే ఎందుకు పట్టుకున్నారు….ట్రైలర్స్ పై కరణ్ జోహార్…!

by AJAY
Published: Last Updated on

ప్రస్తుతం కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దాంతో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఇటీవల బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ పుట్టినరోజు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పుట్టిన రోజుకు హాజరైన పలువురు సెలబ్రిటీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. షారుఖ్ ఖాన్, కత్రీనా తో పాటు మరికొందరు కరోనా భారిన పడ్డారు.

దాంతో కరణ్ జోహార్ లు ఈ వయసులో బర్త్ డే లు అవసరమా అతడి వల్లే కరోనా స్ప్రెడ్ అయ్యింది అంటూ నెటిజన్లు ట్రోల్స్ మొదలెట్టారు. దానికి తాజాగా కరణ్ సీరియస్ అయ్యాడు. తను ఇచ్చిన బర్త్ డే పార్టీ వల్లే కరోనా వ్యాపించింది అని వార్తలు రావడం బాధించింది అన్నారు.

కరోనా ఎవరికీ ఎప్పుడు వచ్చిందో తెలియదని…..తాను పార్టీ ఇచ్చిన వారంలోనే ఎన్నో పెళ్లిళ్లు, షూటింగ్ లు జరిగాయని అన్నారు. అలాంటప్పుడు తన వల్లే కరోనా వ్యాపించింది అని ఎలా అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కరోనా ను సృష్టించలేదు అని వ్యాప్తి చేయలేదు అని అలాంటప్పుడు తనను ఎందుకు శిక్షిస్తారని ప్రశ్నించాడు.

Visitors Are Also Reading