ఫిదా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేసిన హీరోయిన్ సాయిపల్లవి. ఫిదా సినిమాతోనే సాయిపల్లవి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతే కాకుండా మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమా కంటే ముందు సాయిపల్లవి ప్రేమమ్ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో సాయిపల్లవి ప్రొఫెసర్ పాత్రలో నటించగా ప్రేక్షలను ఎంతగానో ఆకట్టుకుంది.
Advertisement
కాగా టాలీవుడ్ లో వచ్చిన ఫిదా సినిమా తరవాత సాయిపల్లవి వరుస ఆఫర్ లను అందుకుంది. ఇక సాయిపల్లవి నటన మరియు అందంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. సాయిపల్లవికి మిగతా హీరోయిన్ల కంటే ఎక్కువ క్రేజ్ ఉంది. మామూలుగా హీరోలకు ఎలాంటి ఫాలోయింగ్ ఉంటుందో అలాంటి ఫాలోయింగ్ ఉంటుంది. సాయిపల్లవి కోసమే సినిమాకు వెళ్లే వారు కూడా చాలా మంది ఉంటారు.
Advertisement
ఇక సాయిపల్లవి రీసెంట్ గా విరాటపర్వం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ విడుదలైంది. అంతే కాకుండా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో విరాటపర్వం సినిమా హీరో రానా ట్రైలర్ ను షేర్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ ను రీట్వీట్ చేసి నిర్మాత కరణ్ జోహార్ ట్వీట్ చేశారు. ఈ ట్రైలర్ ఫెంటాస్టిక్ గా ఉంది రానా…ఈ సినిమా చూడటానికి వెయిట్ చేయలేకపోతున్నాం. మీరు అధ్భుతంగా నటించారు. సాయిపల్లవికి నేను పెద్ద అభిమానిని అంటూ కరణ్ జోహార్ ట్వీట్ లో పేర్కొన్నారు.