Home » కోహ్లీని తప్పించండి అంటున్న కపిల్ దేవ్…!

కోహ్లీని తప్పించండి అంటున్న కపిల్ దేవ్…!

by Azhar
Ad

భారత మాజీ కెప్టెన్ కు ఇన్ని రోజులు సపోర్ట్ చేస్తూ వచ్చిన మాజీ ఆటగాళ్లు ఇప్పుడు విమర్శిస్తున్నారు. అయితే గత మూడేళ్ళుగా కోహ్లీ సెంచరీ చేయడం లేదు. అలాగే గత కొంత కాలంగా అసలు బ్యాటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అందువల్ల ఇలాంటి పరిస్థితి అనేది ప్రతి క్రికెటర్ కు వస్తుంది.. ఇప్పుడు కోహ్లీ అలాంటి స్టేజ్ లోనే ఉన్నాడు అని అందరూ చెప్పుకొచ్చారు. కొంచెం రెస్ట్ తీసుకుంటే చాలు కోహ్లీ రాణిస్తాడు అని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం అలా జరగడం లేదు.

Advertisement

ఐపీఎల్ తర్వాత రెస్ట్ తీసుకొని వచ్చిన కోహ్లీ మళ్ళీ అదే ఫెయిల్యూర్ పద్ధతిలో తన బ్యాటింగ్ అనేది చేస్తునాడు. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో విఫలమయ్యాడు. దాంతో కోహ్లీని ఇప్పుడు జట్టు నుండి తప్పించండి అని టీం ఇండియాకు మొదటి ప్రపంచ కప్ తెచ్చిన కపిల్ దేవ్ పేర్కొన్నారు. తాజాగా ఓ షోకి కపిల్ దేవ్ మాట్లాడుతూ.. కోహ్లీని ఇప్పుడు టీ20 జట్టులో ఆడించకూడదు. అతడిని బెంచ్ పైనే కూర్చోబెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు కోహ్లీ పరుగులు చేయలేకపోవుతున్నాడు. తన స్థాయి ప్రదర్శన అనేది ఇవ్వడం లేదు. ప్రస్తుతం విరాట్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ అనేది అతని బ్యాటింగ్ వల్లే వచ్చింది.

Advertisement

కానీ ఇప్పుడు కోహ్లీ బ్యాటింగ్ అలా లేదు. అంతేగాకుండా కోహ్లీ స్థానంలో రాణించడానికి చాలామంది యువ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు అనేది నిజం. ఏ స్థానానికి అయిన పోటీ ఉంటేనే ఆటగాళ్లు రాణిస్తారు. ఇప్పుడు కోహ్లీ స్థానానికి కూడా ఆ పోటీ ఉంది. కాబట్టి పరుగులు చేస్తున్న యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలి. కోహ్లీని పక్కకు పెట్టాలి. జట్టులో పేరు, క్రేజ్ అనే దానితో ఆడించలేము. ఐసీసీ ర్యాంకింగ్స్ లో 2వ స్థానంలో ఉన్న అశ్విన్ ను ఆడించనప్పుడు 13వ స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ ఆడించటం ఎందుకు అని కపిల్ దేవ్ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి :

గతిలేక ఆ పని చేస్తున్నం అంటున్న గంగూలీ..!

జడేజా పై సీఎస్కే అధికారి షాకింగ్ కామెంట్స్…!

Visitors Are Also Reading