Home » చిరంజీవికీ తమిళ్ లో అందుకే ఫ్యాన్స్ లేరు అంటున్న కమల్ హాసన్..!

చిరంజీవికీ తమిళ్ లో అందుకే ఫ్యాన్స్ లేరు అంటున్న కమల్ హాసన్..!

by Azhar
Ad
లోకనాయకుడు కమల్ హాసన్ గురించి ఎవరికీ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలో నటించి మెప్పించిన కమల్ రాజకీయాల కారణంగా గత నాలుగు ఏళ్లుగా సినిమాకు దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన హీరోగా వాచాహిన సినిమా విక్రమ్. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదలైంది. అయితే ప్రతి చోట నుంచి కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
అయితే ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాగా… అంతకముందు కమల్ ప్రమోషన్స్ లో భాగంగా చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అందులో ఒక్క దానిలో చిరంజీవి గురించి షాకింగ్ కామెంట్స్ చేసారు. చిరంజీవికీ తమిళ్ లో ఫ్యాన్స్ ఎందుకు లేరో ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. కానీ నేను చిరంజీవి ఎప్పుడో పాన్ ఇండియా సినిమాలు చేసాం. చిరు తమిళ్ లో కూడా కొన్ని సినిమాలు చేసారు. కానీ అక్కడ ప్రజలు తెలుగు హీరోలను పట్టించుకోరు.. అందుకే చిరు అక్కడ సినిమాలు చేయడం లేదు అని అనుకుంటారు.
కానీ అది చాలా తప్పు. చిరు చేసిన తమిళ్ సినిమాలు కూడా బాగానే హిట్ అయ్యాయి. కానీ ఆ తర్వాత తనను ఎంతగానో ఆదరిస్తున్న తెలుగు అభిమానులను దృష్టిలో ఉంచుకొని కేవలం ఇక్కడే ఆయన సినిమాలు తీశారు. అందుకే ఆయనకు అక్కడ ఫ్యాన్స్ అంతగా లేరు. అందుకు కారణం చిరంజీవి తమిళ్ లో సినిమాలు చేయకపోవడం ఒక్కటే కారణం అని కమల్ అన్నారు. అయితే కమల్ తో పాటుగా ప్రతి తమిళ్ హీరో కూడా తన సినిమాను తెలుగులో విడుదల చేస్తారు. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఇదే ఫాలో అవుతున్నారు.

Advertisement

Visitors Are Also Reading