కొంతమంది నటులు ప్రేక్షకుల మదిలో నిలిచిపోతారు. అలాంటి నటులలో కళ్లు చితంబరం కూడా ఒకరు. ముఖ్యంగా అమ్మోరు సినిమాతో కళ్లు చితంబరం ఎంతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో సీరియస్ లుక్ లో కనిపిస్తూ బయపెడుతూ ఉంటారు. కళ్లు చితంబంరం కళ్లు అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. అయితే ఒక్క అమ్మోరు మినహా అన్ని సినిమాలలో కూడా కళ్లు చితంబరం కామెడీ పాత్రలు చేసి నవ్వించారు.
అయితే కళ్లు చితంబరం కు మెల్ల ఉంటుందన్న సంగతి తెలిసిందే. అతని కళ్లతోనే చితంబరం ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకుని కళ్లు చితంబరంగా ఫేమస్ అయ్యారు. అయితే నిజానికి కళ్లు చితంబరం కు పుట్టుకతో మెల్ల లేదట….అది అనారోగ్యం కారణంగా వచ్చిందని ఆయన కుమారుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Advertisement
Advertisement
ఆరో తరగతి చదువుతున్న రోజుల నుండే చితంబరం నాటకాలు వేసేవారట. ఆ తరవాత పోర్టులో ఉద్యోగం చేస్తూనే నాటకాలు వేయడం…నాటకాలు అరేంజ్ చేయడం లాంటివి చేసేవారట. అయితే ఉద్యోగం…నాటకాలు ఇలా రెస్ట్ లేకుండా పనిచేయడం నిద్రలేకపోవడం వల్ల కన్ను వద్ద ఓ నరం పక్కకు జరిగిందట.
also read : RRRలో “లోకి” పాత్రలో నటించిన నటి ఎవరో తెలుసా…? జకన్న ఎలా ఆఫర్ ఇచ్చారంటే….!
దాంతో ఆయనకు మెల్ల కన్ను వచ్చిందట. డాక్టర్ లకు చూపిస్తే వాళ్లు ఆపరేషన్ చేస్తే సరిపోతుందని చెప్పారట. కానీ బిజీగా ఉండి ఆపరేషన్ కూడా చేయించుకోలేదట. కళ్లు అనే నటకం చూసి ఎంవీ రఘు కళ్లు అనే సినిమాలో అవకాశం ఇచ్చారట. ఆ తరవాత కళ్లు చితంబరం కు వరుస ఆఫర్ లు వచ్చాయట. దాంతో కలిసి వచ్చిందని ఆ కళ్లను కూడా అలాగే ఉంచుకున్నారట.