మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా ఆచార్య. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సినిమాలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ నటించిన సంగతి తెలిసిందే. మరోవైపు రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అయితే ట్రైలర్ లో మాత్రం కాజల్ అగర్వాల్ కనిపించకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోతింది.
చరణ్ జోడిగా నటించిన పూజా ను చూపించి సినిమాలో అసలు హీరో అయిన మెగాస్టార్ పక్కన నటించిన కాజల్ ను చుపించకపోవడానికి ఓ కారణం ఉందంటూ టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఆచార్య సినిమా షూటింగ్ మొదలు పెట్టిన కొద్దిరోజులకే కరోనా కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలో కాజల్ కూడా కరోనా బారిన పడింది.
Advertisement
Advertisement
దాంతో సినిమా షూటింగ్ కు వెళ్ళలేదు. ఆ తరవాత మళ్లీ షూటింగ్ ప్రారంభం అయ్యాక కాజల్ కు ప్రెగ్నెన్సీ వచ్చింది. దాంతో తాను షూటింగ్ కు రాలేను అని చెప్పింది. అలా కాజల్ తీరు తో మేకర్స్ విసిగిపోయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సినిమాలో కాజల్ సీన్ లకు కత్తెర వేసినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా అందుకే ట్రైలర్ లో కూడా అదే రీజన్ తో కాజల్ ను చూపించలేదని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే కాజల్ మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.