Home » మళ్ళీ మీడియాపై విరుచుకుపడిన జయా బచ్చన్

మళ్ళీ మీడియాపై విరుచుకుపడిన జయా బచ్చన్

by Anji
Ad

పలు కార్యక్రమాల్లో మీడియా ఫొటో గ్రాఫర్లు తన చిత్రాలను తీసే సమయంలో కలిగే అసౌకర్యం గురించి తరచుగా జయ మాట్లాడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో జయ తాజాగా తమ కుటుంబ సభ్యులతో ఇంటి వెలుపల ఉన్న ఫోటో గ్రాఫర్ లపై కోపంగా ప్రతిస్పందించడం కనిపించింది. దీపావళి సందర్భంగా ముంబైలోని జుహూలోని ప్రతీక్ష బంగ్లాలో అమితాబ్ బచ్చన్ జయ దంపతులు తమ కుటుంబం సభ్యులతో కలిసి లక్ష్మీ పూజ నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రముఖ బిగ్ బి భార్య జయా బచ్చన్ పాల్గొన్నారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియోలో జయ తమ ఇంటి బయట ఉన్న ఫోటోగ్రాఫర్లను పొరపాటు దారులు అని పిలుస్తూ తీవ్ర కోపంతో విరుచుకుపడ్డారు తమ ఫ్యామిలీ దీపాలు వేడుకల ఫోటోలను తీయడానికి ప్రయత్నించిన మీడియాకు చెందిన ఫోటో గ్రాఫర్లను తరిమికొట్టారు.

Advertisement

ఫోటోగ్రాఫర్లు షేర్ చేసిన క్లిప్ లో ప్రింటెడ్ వైట్ కుర్తా ధరించిన జయ తమ ఇంటి గేటు దగ్గర కనిపించిన ఫోటోగ్రాఫర్లపై విరుచుకుపడ్డారు. అసలు మీరు ఇలా ఎలా చేస్తారు వెంటనే మీ కెమెరాల స్విచ్ ఆఫ్ చేయండి అని చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మంది ఛాయాచిత్రకారులు జయ తాజా చర్య పై ప్రతిస్పందించారు. అబ్బాయిలు ఆమెను ఒంటరిగా వదిలేయండి మీరు అనవసరంగా మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అని కామెంట్ చేశారు.

Advertisement

దీపావళి 2022 పూజ కోసం అమితాబ్ తన భార్య జయతో పాటు అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ దంపతులు ఆరాధ్య బచ్చన్ తో కలిసి ప్రతిక్ష దగ్గరకు వచ్చారు అభిషేక్ కారు నడుపుతుండగా అమితాబ్ బచ్చన్ పక్కనే కూర్చున్నారు వెనక సీట్లో జయ ఐశ్వర్య ఆరాధ్య కూర్చున్నారు. దీపావళి ఉత్సవాల కోసం అందరూ భారతీయ సాంప్రదాయ దుస్తులను ధరించారు. తన వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకునే వ్యక్తులంటే తనకు అసహ్యం అని జయ బచ్చన్ ఇటీవల అన్నారు తమని తమ వ్యక్తిగత విషయాలను అమ్ముడకు తమ కడుపు నింపుకునే వారిని తాను తృణీకరిస్తున్నానని ఆమె పేర్కొంది వారిని ద్వేషిస్తాను అలాంటి వారి పట్ల నాకు అసహ్యం నేను వారితో ఎప్పుడు చెబుతుంటానని అన్నారు జయ.

Also Read :  ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఈ చిన్న టిప్స్ పాటించాల్సిందే.. పక్కన బాంబు పేలిన లేవరనుకోండి..!!

Visitors Are Also Reading