Home » 46 ఏళ్ల క్రితమే చావు నుంచి తృటిలో తప్పించుకున్న జమున.. జరిగిందేంటంటే..?

46 ఏళ్ల క్రితమే చావు నుంచి తృటిలో తప్పించుకున్న జమున.. జరిగిందేంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సావిత్రి,జమున, షావుకారు జానకి, అంజలీదేవి, కృష్ణకుమారి, అలనాటి హీరోయిన్లలో మేటి హీరోయిన్లు. ఒక్కొక్క హీరోయిన్ దాదాపుగా వందలాది సినిమాల్లో నటించేవారు. అలా సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ జమున.. ఆమె ఏ పాత్రలో చేసిన ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే. అయితే జమున అప్పట్లో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరితో జతకట్టింది.. ఇక ఆమె ఎక్కువగా హీరో హరినాథ్ తో నటించింది. వీరి కాంబినేషన్ లో దాదాపుగా చాలా సినిమాలు వచ్చాయి. అందులో చాలా వరకు సూపర్ హిట్. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమాలు లేత మనసులు. ఈ మూవీ జమున కెరియర్ ను మలుకు తిప్పిందని చెప్పవచ్చు. ఈమెకు ఈ సినిమా ఎంత పేరు తెచ్చిందో ఆమె పాలిట అంత శాపంగా మారింది.మరి ఆ విశేషాలు ఏంటో చూద్దాం..

Advertisement

Advertisement

అప్పట్లో లేత మనసులు సినిమా షూటింగ్ జరుగుతోంది. జమున హరినాథ్ జంటగా ఒక సాంగ్ షూట్ చేస్తున్నారు.. ఆ సాంగ్ అందాల ఓచిలక అందుకో ఈ లేక.. దర్శకుడు యాక్షన్ చెప్పారు. షాట్ ప్రకారం హీరోయిన్ జమున గడ్డి కుప్ప మీద నుంచి కిందికి దూకాలి. ముందు ఒక షాట్ అయిపోయింది. బాగానే ఉంది. కానీ ఇంకా పర్ఫెక్షన్ రావాలని మరోసారి చేయమన్నాడు దర్శకుడు. మళ్లీ గడ్డి పైకి జమున ఎలాంటి ఇబ్బందులు లేకుండా కిందికి జారింది. ఈ టైంలోనే పట్టు తప్పిన హరనాథ్ జమున మీద నేరుగా పడిపోయాడు.

అది కూడా ఆమె మెడలపై గట్టిగా పడ్డాడు. దీంతో జమున కింద పడిపోయింది. కాసేపటి వరకు లేవలేదు. అంతా కంగారు పడ్డారు. కొద్దిసేపు తర్వాత జమున మెలకువకు వచ్చింది.. ఆ టైంలో ఏమీ అనిపించలేదు. ఆ తర్వాత సినిమా విడుదలై సూపర్ హిట్ కొట్టింది. కానీ జమున మెడకు శాపంగా మారింది. ఆమె మెడనరాలు నలిగిపోవడం వల్ల తల ఊపే జబ్బు వచ్చింది. ఆ జబ్బు అప్పటినుంచి ఇప్పటివరకు ఆమెను వదిలిపెట్టలేదు. అయితే జమున ఆ సమయంలోనే కన్నుమూసేది. అదృష్టవశాత్తు బతికిపోయిందని చాలామంది అంటుంటారు.

also read:

Visitors Are Also Reading