Home » మహానటి చిత్ర యూనిట్ అన్యాయం చేసిందంటూ బోరుమని ఏడ్చిన జమున..!!

మహానటి చిత్ర యూనిట్ అన్యాయం చేసిందంటూ బోరుమని ఏడ్చిన జమున..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

మహానటి సావిత్రి బయోపిక్ ఎంత అద్భుతంగా తీసారో మనందరికీ తెలుసు. అలనాడు సావిత్రి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆమె పరమపదించే వరకు జీవితం ఎలా సాగిందో కళ్ళకు కట్టినట్టు చూపించారు. అలాంటి మహానటి సినిమాపై అలనాటి హీరోయిన్ జమున కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. మహానటి సినిమా తీసేటప్పుడు సావిత్రి కి సంబంధించిన అందరినీ కలిసిందట చిత్ర యూనిట్. కానీ అలనాటి హీరోయిన్ జమునను కలవలేదట.

Advertisement

also read:తెలుగు స్టార్ హీరోల ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతంటే..?

అసలు ఆ మూవీ తీస్తున్నట్టు జమునకు తెలియదట. జమున పాత్ర లేకుండా సినిమా ఎలా తీయగలిగారని,జమున గారు సావిత్రిని అక్క అని పిలుస్తూ ఎప్పుడు వీరిద్దరూ కలిసి ఉండేవారట. అసలు జమునను ఇండస్ట్రీకి పరిచయం చేసిందే సావిత్రి. వీరిద్దరు సొంత అక్క చెల్లెళ్ళలా , ఎప్పుడు కలిసిమెలిసి ఉండేవారని ఒకరి విషయాలు మరొకరికి చెప్పుకుంటూ ఉండేవారని చెప్పారు జమున. అసలు సావిత్రి బయోపిక్ చేయడం జమునకు చాలా బాధేసిందట. సావిత్రి ఇండస్ట్రీలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో, జమునకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. సావిత్రి జీవితంలోని ప్రతి ఘటన గురించి జమునకు తెలుసట. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జమున మహానటి సినిమా గురించి అడిగినప్పుడు ఇలా కామెంట్స్ చేసిందట.. ఆ తరం హీరోయిన్లలో బ్రతికి ఉన్న నన్ను చిత్ర యూనిట్ అస్సలు సంప్రదించలేదు. అసలు నేను సినిమానే చూడలేదు. సావిత్రి జీవితంలో జరిగిన ప్రతి అంశాన్ని నేను చెప్పగలను.

Advertisement

ఆవిడ పర్సనల్ లైఫ్ గానీ మా ఇద్దరి సినిమా అనుబంధం కానీ, ఎంతో బాగా ఉండేదో చెప్పుకొచ్చింది. మిస్సమ్మ సినిమాలో మేమిద్దరం అక్క చెల్లెళ్లలా నటించాం. నిజజీవితంలో కూడా ఆ విధంగానే ఉన్నాం. సీనియర్స్ నీ గౌరవించే వాళ్ళం అంటూ చెప్పుకొచ్చారు సీనియర్ నటి జమున. ఈ సినిమా గురించి నన్ను సంప్రదించకపోవడం చాలా బాధనిపించింది. కానీ సినిమా బాగుందని అందరూ అంటుంటే ఆనందం అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది జమున.

also read:

Visitors Are Also Reading