Home » జబర్దస్త్ లో అవ్వని నిజాలే అంటున్న వర్ష..!

జబర్దస్త్ లో అవ్వని నిజాలే అంటున్న వర్ష..!

by Azhar
Ad

టీవీ షోలలో ఓ వెలుగు వెలిగిన కార్యక్రమం జబర్దస్త్. కానీ ఇప్పుడు దీని రేటింగ్స్ పడిపోతున్నాయి అనే విషయం అందరికి తెలిసిందే. అందుకు కారణం ఈ షో నుండి చాలా ముఖ్యమైన వారు బయటికి వెళ్లిపోవడమే. అయితే ఈ షోలో ఇమాన్యుల్ తో కలిసి ఓ ట్రాక్ నడిపిస్తూ వర్ష చాలా తొందరగానే పేరు తెచ్చుకుంది. అయితే అది కేవలం ఈ షో వరకే అని అందరికి తెలుసు. ఇక ఇందులో ఏం చేసిన అంత టీఆర్పీ స్టాంట్ అనేది ప్రజలకు తెలిసిన విషయమే. అయితే కొన్ని సందర్భాలలో అక్కడ ఆర్టిస్టులు ఏడుస్తారు. అది కూడా టీఆర్పీ కోసమే అని ప్రజలు భావిస్తారు.

Advertisement

Advertisement

కానీ అవి అని జ్=నిజం అంటుంది వర్ష. తాజాగా వర్ష మాట్లాడుతూ.. కొన్ని సందర్భాలలో ఆర్టిస్టులు కానీ మిగితా వారు కానీ స్టేజ్ పైన ఏడుస్తూ.. ఎమోషనల్ అవుతూ ఉంటారు. అవి అందరూ టీఆర్పీ కోసం అనుకుంటారు. కానీ మేము అన్ని టీఆర్పీ కోసం మాత్రమే చేయం. అవి నిజమే. కొన్నిసార్లు అక్కడ వారు నిజంగానే ఏడుస్తూ ఉంటారు అని వర్ష తెలిపింది. ఎందుకంటే ఇందులో చేసే వారందరు కూడా మనుషులే. వారు పడిన కష్టాలు గుర్తుకు వచ్చినప్పుడు ఆ ఏడుపు అనేది వచ్చేస్తుంది అని వర్ష తెలిపింది.

ఇక ఈ మధ్య ఈ షో నుండి అందరూ వెళ్లిపోవడం పై మాట్లాడుతూ.. జబర్దస్త్ లో అందరూ చాలా మంచివారు. ఎవరికీ ఏ కష్టం వచ్చిన అందరూ ఒక్కో చేయి వేసి వారిని ఆదుకుంటారు. ఇక మేమందరం ఒక్క కుటుంబం ల కలిసి ఉంటాం. అందుకే ఎవరైనా ఇందులో నుండి వెళ్ళిపోతే మా కుటుంభం లో నుండి ఒక్కరు వెళ్లిపోయారు ఏమో అనే భావన మాకు కలుగుతుంది అని వర్ష పేర్కొంది. ఇక ఈ మధ్య రోజాతో పాటుగా సుధీర్, ఆది, గెటప్ శ్రీను అందరూ జబర్దస్త్ ను వదిలేసి తమ సొంత దారిలో వెళ్లిపోయిన విషయం అందరికి తెలిసిందే.

Visitors Are Also Reading