తెలుగు లో టాప్ కామెడీ షో జబర్దస్త్ కు కొత్త యాంకర్ వచ్చిన సంగతి తెలిసిందే. జబర్దస్త్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అనసూయ రష్మి ఈ షో నుండి పక్కకు తప్పుకున్నారు. ఇద్దరూ సినిమాలతో పాటు ఇతర టీవీ షో లతో బిజీగా ఉండటం వల్ల జబర్దస్త్ కు దూరమయ్యారు. ఇక వారి స్థానంలో సౌమ్యా రావు యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. సౌమ్యా రావు తెలుగులో సీరియల్స్ ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
Advertisement
శ్రీమంతుడు అనే సీరియల్ ద్వారా సౌమ్యరావు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. సౌమ్యరావు కర్ణాటక కు చెందిన నటి కాగా న్యూస్ రీడర్ గా మొదట తన కేరీర్ ను ప్రారంభించింది. చాలా కాలం పాటు కన్నడ నాట టీవీ సీరియల్స్ లో నటించి అభిమానులను సంపాదించుకుంది. ఇక ఇప్పుడు జబర్దస్త్ యాంకర్ గా ఎంట్రీ ఇవ్వడంతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.
Advertisement
జబర్దస్త్ కు సంబంధించిన రెండు మూడు ఎపిసోడ్ లు ఇప్పటికే ప్రసారం కాగా అందులో సౌమ్యరావు తన యాంకరింగ్ తో ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా అనసూయ రష్మి రేంజ్ లోనే సౌమ్య సైతం స్కిట్లలో పంచులు వేస్తోంది. ఇదిలా ఉంటే జబర్దస్త్ లో యాంకర్ల రెమ్యునరేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు సౌమ్య రావు కూడా ఈ షో కోసం గట్టిగానే తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒక్కో ఎపిసోడ్ కోసం సౌమ్యరావు ఏకంగా రూపాయలు 85,000 తీసుకుంటున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా సౌమ్య రావు యాంకరింగ్ తో ఆకట్టుకుని షో రేటింగ్ పెరిగితే ఆమె రెమ్యూనరేషన్ మరింత పెంచే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం.