Home » జబర్దస్త్ వాళ్లకు పెట్టే ఫుడ్ కంటే జైలు ఫుడ్ బాగుంటుంది.. ఆర్పీ సెన్సేషనల్ కామెంట్స్…!

జబర్దస్త్ వాళ్లకు పెట్టే ఫుడ్ కంటే జైలు ఫుడ్ బాగుంటుంది.. ఆర్పీ సెన్సేషనల్ కామెంట్స్…!

by AJAY
Ad

ఒకప్పటి టాప్ కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు సినిమాలకు బుల్లితెరకు పరిచయమయ్యారు. ప్రస్తుతం జబర్దస్త్ ద్వారా వచ్చినవాళ్లే బుల్లితెరను ఏలుతున్నారు. అయితే ఈ షో నుండి ఒక్కొక్కరు మెల్లిమెల్లిగా కనుమరుగు అవుతున్న సంగతి తెలిసిందే. దాదాపుగా ఈ షోతో పాపులారిటీ వచ్చిన వాళ్లంతా వేరే టీవీ షోలకు షిఫ్ట్ అయిపోయారు.

Advertisement

దాంతో కొత్త వాళ్ళతో జబర్దస్త్ ను నెట్టుకు వస్తున్నారు. ఇక జబర్దస్త్ నుండి బయటకు వచ్చినవాళ్లు ఆ షో యాజమాన్యం మల్లెమాలపై నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి పై ఆరోపణలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. కాగా తాజాగా జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి టీం లీడర్ గా ఎదిగిన ఆర్పి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

ఆర్పీ ఓ ఇంటర్వ్యూలో జబర్దస్త్ పై స్పందించాడు. తన కు ఈటీవి అంటే చాలా ఇష్టమని చెప్పాడు. కానీ మల్లె మాల ఎంటర్టైన్మెంట్ అన్నా శ్యామ్ ప్రసాద్ రెడ్డి అన్నా కూడా ఇష్టం లేదని అలాగే జబర్ దస్త్ కూడా ఇష్టం లేదని చెప్పాడు. అంతే కాకుండా అక్కడ పెట్టే ఆహారం చర్లపల్లి,అండమాన్ జైలు కంటే వరస్ట్ గా ఉంటుంది అని అన్నారు.

అక్కడితో ఆగకుండా సినిమా ఇండస్ట్రీ చరిత్ర లోనే అలాంటి ఆహారం ఎక్కడ కూడా పెట్టరని అన్నారు. జబర్ దస్త్ ఆర్టిస్ట్ లు బిల్డింగ్ కట్టే కూలీలు టిఫిన్ తినే సైకిల్ వద్ద క్యూ కట్టి తినేవాళ్ళు అని చెప్పారు. జబర్దస్త్ లో పెట్టే ఫుడ్ గురించి ఎవరిని అడిగినా చెప్తారు అని అన్నారు. ప్రస్తుతం ఆర్పీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక గతం లో కూడా పలువురు కమెడియన్స్ ఇలాంటి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

Visitors Are Also Reading