Home » ఈ ఒక్క కారణం వల్లే చిరంజీవి కృష్ణలను పక్కనబెట్టి.. మోహన్ బాబుతో సినిమా చేశారా..బిగ్ ట్విస్ట్ ఏంటంటే..?

ఈ ఒక్క కారణం వల్లే చిరంజీవి కృష్ణలను పక్కనబెట్టి.. మోహన్ బాబుతో సినిమా చేశారా..బిగ్ ట్విస్ట్ ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ,మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారుండరు. వీరిద్దరి కాంబోలో వచ్చిన మొదటి చిత్రం తోడుదొంగలు.. ఈ మూవీ తర్వాత కొన్ని నెలలకు మరో మూవీ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ ఈ మూవీ షూటింగ్ కు వెళ్లకుండా ఆగిపోయింది. అది ఎలా జరిగిందో చూద్దాం.. హీరో కృష్ణ తో ఒక మూవీ తీయాలన్నది నిర్మాత బాబు రావు కోరిక. ఆయన సారధ్యంలో వచ్చిన మొదటి చిత్రం ఆడదంటే అలుసా, ఆతర్వాత పెళ్ళిళ్ళ పేరయ్య, ఇక మూడవ సినిమా కృష్ణ తో చేయాలని భావించారు. దీంతో మలయాళంలో తినలంగలు సినిమా విజయం అందుకుంది. అక్క తమ్ముళ్ల కథ అది. బాబురావు కు ఈ మూవీ నచ్చి సినిమా రీమేక్ హక్కులను కొనేశారు. కథలో మార్పులు చేర్పులు చేసి స్క్రిప్టు తయారు చేశారు.

Advertisement

also read:ఒకప్పటి తార సిల్క్ స్మిత రాసిన చివరి ఉత్తరం..! జీవితంలో అంతటి నరకాన్ని చూసిందో ఆమె మాటలలోనే..!

Advertisement

ఇందులో అన్నదమ్ముల పాత్రలకు కృష్ణ మరియు మెగాస్టార్ చిరంజీవిని తీసుకుందామని భావించారు. దీంతో హీరో కృష్ణ కూడా ఓకే చెప్పారు. దర్శకుడిగా కె.ఎస్.ఆర్.దాస్ ను తీసుకున్నారు. ఈ మూవీకి అగ్నిజ్వాల అనే పేరు కూడా పెట్టారు. కృష్ణ డేట్స్ ఇచ్చారు కానీ చిరంజీవి డేట్స్ కుదరకపోవడంతో, మరో హీరో ని చూడాలని కృష్ణ బాబురావుకి చెప్పారట. ఈ టైం లోనే విష్ణువర్ధన్ పద్మప్రియ జంటగా వచ్చిన మూవీ అసాధ్య ఆలియా విడుదలై భారీ విజయం అందుకుంది. కృష్ణ ఆ సినిమా చూశారు. అగ్నిజ్వాల కథకంటే ఈ కన్నడ చిత్రం మంచి సినిమా అవుతుందని భావించారు.

దీంతో నిర్మాత అసాధ్య అలియా రీమేక్ హక్కులను కొన్నారు. పాత సినిమా స్క్రిప్ట్ పక్కనబెట్టి హీరో కృష్ణ జయప్రద కాంబో లో అసాధ్య అలియా సినిమాను మాయదారి అల్లుడు పేరుతో రీమేక్ చేశారు. కథలో మార్పులు చేర్పులు చేసి సరికొత్తగా తీర్చిదిద్దారు దాసు. మూవీ సూపర్ హిట్ అయింది. కానీ ఆ తర్వాత కూడా అగ్నిజ్వాల స్క్రిప్ట్ ను వదిలిపెట్టలేదు నిర్మాత.. మోహన్ బాబుతో   అగ్నిజ్వాల చిత్రాన్ని నిర్మించి తన కోరిక తీర్చుకున్నారు నిర్మాత బాబురావు.

also read:అర్ధరాత్రి 12:ఎన్టీఆర్+ జయలలిత..అమ్మ బాబోయ్ అంత పని చేశారా..?

Visitors Are Also Reading