Home » 20 ఏళ్లుగా చిరు విజయశాంతి ఎందుకు మాట్లాడుకోలేదో తెలుసా…? తెరవెనక జరిగింది ఇదే..!

20 ఏళ్లుగా చిరు విజయశాంతి ఎందుకు మాట్లాడుకోలేదో తెలుసా…? తెరవెనక జరిగింది ఇదే..!

by AJAY
Ad

విజయశాంతి ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు టాలీవుడ్ లో విజయశాంతి స్టార్ హీరోయిన్ గా రాణించారు. దాదాపు స్టార్ హీరోలు అందరితోను విజయశాంతి జోడి కట్టారు. అంతేకాకుండా కేవలం హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి విజయశాంతి అభిమానులను సంపాదించుకున్నారు. అప్పట్లో విజయశాంతిని లేడీ అమితాబ్ అని పిలుచుకునేవారు అంటే ఆమె ఏ రేంజ్ లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

ఇక విజయశాంతి… చిరంజీవి బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో ఎక్కువ సినిమాలు చేశారు. అంతేకాకుండా బాలయ్యతో అత్యధికంగా 17 సినిమాలలో నటించగా వారి కాంబినేషన్ ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. ఇక చిరంజీవితోను విజయశాంతి చాలానే సినిమాలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గ్యాంగ్ లీడర్, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, పసివాడి ప్రాణం, కొండవీటి దొంగ లాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ లుగా నిలిచాయి.

Advertisement

 

అయితే చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే… గ్యాంగ్ లీడర్ సినిమా షూటింగ్ సమయంలో విజయశాంతి చిరు మధ్య గొడవలు జరిగాయి. అంతేకాకుండా ఆ గొడవల వల్లనే ఇద్దరు దాదాపు 20 సంవత్సరాల పాటు మాట్లాడుకోలేదని వార్తలు వినిపించాయి. కాగా ఈ విషయంపై విజయశాంతి ఓ సందర్భంలో స్పందించారు. 20 ఏళ్ల తర్వాత చిరుతో మాట్లాడింది మళ్ళీ సరిలేరు నీకెవ్వరు ఆడియో ఫంక్షన్ లోనే అంటూ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే చిరంజీవి సైతం సరిలేరు నీకెవ్వరు ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ… నేను నిన్ను ఎప్పుడైనా విమర్శించానా.. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నన్ను ఎందుకు విమర్శించావు అంటూ విజయశాంతిని దగ్గరకు తీసుకున్నారు. అంతేకాకుండా విజయశాంతి గురించి మాట్లాడుతూ అదే పొగరు అదే ఫిగరు అంటూ ప్రశంసలు కురిపించారు.

Also read : అనసూయ ఎవరి కూతురో తెలుసా? అసలు ఆమె తెలంగాణా, ఆంధ్రానా !

Visitors Are Also Reading