Home » ప్రధాని కోసం ప్రత్యేకంగా టర్కీ దేశం స్టాంపు విడుదల.. వాస్తవమేనా..?

ప్రధాని కోసం ప్రత్యేకంగా టర్కీ దేశం స్టాంపు విడుదల.. వాస్తవమేనా..?

by Anji
Published: Last Updated on
Ad
భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రం ఉన్న స్టాంపు ఒకటి ప్రస్తుతము ఫేస్ బుక్ లో వైరల్ అవుతుంది. టర్కీ దేశం ఈ స్టాంపును విడుదల చేసినట్టు చెబుతున్నారు. అంతేకదు.. ప్రపంచంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ గొప్ప నాయకుడు అని పోస్టుల ద్వారా ప్రచారం చేస్తున్నారు.
ప్రపంచంలోనే నరేంద్ర మోడీ గొప్ప నాయకుడు అని టర్కీ స్టాంపును విడుదల చేసింది. ప్రతి భారతీయుడు గర్వపడాలి అనే క్యాప్షన్ తో నెటిజన్లు ఆ చిత్రాన్ని షేర్ చేస్తున్నారు. వాస్తవానికి ఇది ఈ పోస్ట్ పాత అయినప్పటికీ ప్రస్తుతము తెగ వైరల్ అవుతోంది.
2015లో టర్కీ స్టాంపును విడుదల చేసిందని.. అప్పట్లో సోషల్ మీడియాలో కోడై కూసింది. వాస్తవానికి ఇది ప్రధాని కోసం కాదని తెలిసింది. రెండు వేల పదిహేను నవంబర్ నెలలో జి 20 లీడర్స్ అందరూ సమిట్ కి హాజరై సభ్యులందరికీ పర్సనలైజ్డ్  స్టాంపులు జారీ చేయబడ్డాయి. దాదాపు 33 పర్సనలైజ్డ్  స్టాంపులను టర్కీ అధ్యక్షుడు రేసెప్ తయ్యప్ ఎగ్దోగాన్ జీ -20 సమ్మిట్ జ్ఞాపకార్థం ఆవిష్కరించారు. టర్కీ ప్రభుత్వం  జీ-20 సమ్మిట్ కి హాజరైన వారి అందరి నాయకుల స్టాంపులను విడుదల చేయడం విశేషం.
Also Read : 

Advertisement

Visitors Are Also Reading