Home » బాలకృష్ణ శోభన్ బాబు హీరోలుగా.. 3కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనా..!!

బాలకృష్ణ శోభన్ బాబు హీరోలుగా.. 3కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో స్థిరపడాలని చిన్న నిర్మాతలు అభివృద్ధి చెందాలని, లో బడ్జెట్ సినిమాలు బాగా ఆడాలని, ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు మొదట్లో అనుకూలంగానే ఉన్నాయి. అయితే రాయితీతో మంచితో పాటు చెడూ కూడా జరిగింది. చిన్న సినిమా నిర్మాణాలు పెరగడంతో నటీనటులు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా విడిపోయారు.ఒకరితో ఒకరు పోటీ పడి తొందరగా సినిమాలు పూర్తి చేయాలి అనే ఆలోచన తప్ప మంచి సినిమాలు చేయాలనే ఆలోచన ఎవరిలో లేదు. ఇలాంటి హడావిడిల కారణంగానే భారీగా నష్టపోయినా పెద్ద బడ్జెట్ చిత్రం అశ్వమేధం. నటభూషణ్ శోభన్ బాబు, నటసింహ బాలకృష్ణ ఇద్దర్నీ కలిపి అశ్వినీ దత్ గారు అశ్వమేధం షూటింగ్ ప్రారంభించారు. శోభన్ బాబు గారు బాలకృష్ణ, మీనా,నగ్మా, బాబు మోహన్,బ్రహ్మానందం అశ్వమేధం సినిమా పాటతో ఈ షూటింగ్ ప్రారంభమైంది. శోభన్ బాబు కి జంటగా గీతా నటించారు.ఈ సినిమాలో ముగ్గురు విలన్లు ఉండటం విశేషం. తనకు బాగా నచ్చిన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఇళయరాజా గారిని తీసుకున్నారు అశ్వినీ దత్. ఈ సినిమాకు మూడు కోట్ల బడ్జెట్ తో అశ్వినీ దత్ గారు తెరకెక్కించారు. 1992 డిసెంబర్ 25 న అశ్వమేధం సినిమా రిలీజ్ అయింది. అప్పట్లో సినిమాలకు ఓపెనింగ్ కలెక్షన్స్ బాగా వచ్చినా కూడా వంద రోజులు ఆడడం కష్టంగానే ఉండేది. అయితే ఈ సినిమాకు అశ్విని దత్ గారు ఊహించనంత ఫలితం రాలేదు. అంతమంది అగ్ర తారలతో కలిసి తీసిన ఈ సినిమా కమర్షియల్ గా నష్టాలను మిగిల్చింది అని చెప్పవచ్చు.

Advertisement

ALSO READ ;

Advertisement

తిరుప‌తి భ‌హిరంగ స‌భ‌లో ఎన్టీఆర్ పై కృష్ణ చేసిన ఘాటు విమ‌ర్శ‌లు…ఆ త‌ర‌వాత వైఎస్ఆర్ ఎమ‌న్నారంటే…!

జయప్రద చేసిన ఆ సినిమా సూపర్ హిట్ అయినా.. ఆ దర్శకుడు ఆమెను ఎందుకలా అవమానించారు..!!

 

 

Visitors Are Also Reading