Home » శ్రీహరి మృతి వెనుక ఇంత మిస్టరీ ఉందా.. ఎవరి పర్మిషన్ లేకుండా ఆ ఇంజక్షన్ ఇవ్వడం వల్లే ఇలా జరిగిందా..?

శ్రీహరి మృతి వెనుక ఇంత మిస్టరీ ఉందా.. ఎవరి పర్మిషన్ లేకుండా ఆ ఇంజక్షన్ ఇవ్వడం వల్లే ఇలా జరిగిందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటులు లో ఒకరిగా చెప్పుకునే హీరోల్లో శ్రీహరి మొదటి వరసలో ఉంటారు. ఆయన ఎన్నో కష్టాలు అనుభవించి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తన కెరియర్ మొదట్లో విలన్ పాత్రలు, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా ఏది దొరికితే అది చేసుకుంటూ తన టాలెంట్ ను బయటపెట్టారు. ఆ తర్వాత హీరోగా చేసి అగ్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా నటించి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన సినిమాల్లో నటన చూస్తే ప్రతి ఒక్కరు క్లాప్స్ కొట్టాల్సిందే. ఈ విధంగా చాలా సినిమాల్లో హీరోగా నటించి చరిత్రలో గొప్ప నటుడిగా మిగిలిపోయారని చెప్పవచ్చు. ఆయన ఇండస్ట్రీకి దూరమై సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇప్పటికే ఏదో ఒక రూపంలో అభిమానులు ఇండస్ట్రీ వర్గాలు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఆయన గురించి ఒక సంచలన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

అది ఏంటో ఒక సారి చూద్దాం.. శ్రీహరి జీవితం గురించి చెప్పుకుంటే ఆయన డిస్కో శాంతి ని వివాహం చేసుకున్న తరువాత ఇద్దరు కుమారులు పుట్టారు. శ్రీహరి అంటే ఇండస్ట్రీలో మంచి గౌరవ మర్యాదలు ఉన్న హీరోగా చాలా మందికి ఇష్టంగా ఉండేవారు. అయితే ఆయన చివరి క్షణాల గురించి డిస్కోశాంతి ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పింది.. తన చివరి రోజుల్లో ప్రభుదేవా డైరెక్షన్ లో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న ఆర్ రాజ్ కుమార్ సినిమా షూటింగ్ లో ఉన్న సమయంలోనే ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే డాక్టర్లకు ఫోన్ చేయడంతో డాక్టర్ వచ్చి ఆయన చెక్ చేసి, నీరసంగా ఉందని చెప్పడంతో సెలైన్ పెట్టారు. కొంత సమయం తర్వాత నర్సు వచ్చి ఏదో ఇంజక్షన్ ఇచ్చారట.. దీని తర్వాత మళ్ళీ కొంత సమయానికి మరో ఇంజెక్షన్ కూడా ఇచ్చారట..

Advertisement

ఆ తర్వాత ముంబైలోని లీలావతి హాస్పిటల్ లో జాయిన్ చేసి ఐసీయూ లో పెట్టారట. అక్కడికి వచ్చిన శ్రీహరి భార్య ను లోపలికి వెళ్లనివ్వకుండా ఉంచడంతో ఆమె చాటుగా వెళ్లి శ్రీహరి ని చూసేసరికి బెడ్ మొత్తం రక్తంతో తడిసి పోయిందట. అది చూసిన డిస్కో శాంతి తట్టుకోలేక గట్టిగా ఏడవడం తో వారు బయటికి తోసెశారని చెప్పింది. దీంతో డిస్కో శాంతి వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి హాస్పిటల్ కి రమ్మన్నారట. ఆ తర్వాత శ్రీహరి దగ్గరికి వెళ్లి చూడడంతో అప్పటికే నర్సు వచ్చి సెలైన్ బాటిల్ లో ఇంజక్షన్ ఇవ్వటం చూసి తట్టుకోలేక పోయింది డిస్కో శాంతి. ఈ క్రమంలోనే బెడ్ చుట్టూ చూసి డాక్టర్లు ఏదో తప్పు చేశారని, లివర్ సమస్య ఉందని తెలిసినప్పుడు నేరుగా ఇంజక్షన్ ఇవ్వడంతో ఆ ఇంజక్షన్ లివర్ కి గుచ్చుకున్నదని దీంతో రక్తం బయటకు కారిపోయిందని చెబుతూ ఎమోషనల్ అయింది. తన నటనతో లక్షలాదిమంది అభిమానుల్ని సంపాదించుకున్న శ్రీహరి.. చివరికి 2013 అక్టోబర్ 9న మృతి చెందారు.. ఆయన మరణ వార్త వినడం తో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది..

also read:

Visitors Are Also Reading