Home » ఎన్టీఆర్, కృష్ణ శత్రువులుగా మారడం వెనుక ఇంత పెద్ద చరిత్ర ఉందా..?

ఎన్టీఆర్, కృష్ణ శత్రువులుగా మారడం వెనుక ఇంత పెద్ద చరిత్ర ఉందా..?

by Anji
Ad

సూపర్ స్టార్ హీరో కృష్ణ స్వతహగా ఎన్టీఆర్ అభిమాని. ముఖ్యంగా తెనాలి రత్న థియేటర్లో చూసిన పాతాళ భైరవి సినిమా కృష్ణ మనసులో చెరగని ముద్ర వేసింది. కృష్ణ చిన్నప్పటినుంచి ఎన్టీఆర్ నీ ఎంతో అభిమానించేవారు. నటుడిగా ప్రయత్నించడానికి చెన్నై వెళ్ళినప్పుడు కృష్ణ తొలుత ఎన్టీఆర్ నే కలిసారట. చిన్న వయసు కారణంగా రెండు సంవత్సరాల పాటు హాల్లో నటించమని కృష్ణకు సలహా ఇచ్చింది కూడా ఎన్టీఆర్ అట. హీరోగా గుర్తింపు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ కృష్ణ కలిసి నటించిన మొదటి చిత్రం స్త్రీ జన్మ. మీరు కలిసి నటించిన ప్రతి సినిమాలో కూడా ఎన్టీఆర్ కి తమ్ముడు గానే కృష్ణ నటించారు అట. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిద్దరి మధ్య గొడవలు రావడం చాలా కాలం మాట్లాడుకోకుండా ఉండడం జరిగింది. వీరిద్దరి మధ్య గొడవలు రావడానికి పరిస్థితులే కారణమనే చెప్పవచ్చు.


దేవుడు చేసిన మనుషులు చిత్రం ప్రారంభం రావడానికి ముందు జరిగిన కొన్ని ఘటనలో వీరిద్దరి మధ్య గొడవలకు కారణమయ్యాయి. పండంటి కాపురం చిత్ర వేడుకల్లో ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో కృష్ణ తన అభిమాన నటుడుతో సినిమా తీయాలని కోరికగానే దానికి ఎన్టీఆర్ సరే అన్నారు. ఇక పండంటి కాపురం చిత్రం సమయంలోనే జై ఆంధ్ర ఉద్యమం స్థాయిలో కొనసాగుతుంది. తులను చూసి చలించిపోయిన కృష్ణ ఆ ఉద్యమానికి తన మద్దతును ప్రకటిస్తూ పత్రిక ప్రకటనను విడుదల చేశారు. ఈ ఉద్యమం సమయంలో తటస్థ వైఖరిని అవలంబిస్తున్న ఎన్టీఆర్ ఏఎన్నార్లకు కృష్ణ వైఖరి అస్సలు నచ్చలేదు. నీతో కృష్ణ తో కలిసి సినిమా చేయనని ఎన్టీఆర్ ప్రకటించేసారంట. ఆవేశంలో అలా మద్దతు ఇచ్చానని కృష్ణ చెప్పిన కూడా ఎన్టీఆర్ వినిపించుకోలేదు.

Advertisement

కొన్ని రోజుల తర్వాత ఎన్టీఆర్ స్వయంగా ఫోన్ చేసి ఆత్మకూరులో జరిగే హరికృష్ణ వివాహానికి రావాలని కృష్ణను ఆహ్వానించారట. దీంతో కృష్ణ విజయనిర్మల దంపతులు ఆ పెళ్లికి హాజరయ్యారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు తొలగి దేవుడు చేసిన మనుషులు సినిమాలో ఇద్దరు కలిసి నటించారు. ఆ చిత్రం పూర్తి అవ్వగానే తన తదుపరిచిత్రం అల్లూరి సీతారామరాజు సినిమాను కృష్ణ ప్రకటించారు. ఈ సినిమాని తానే తీస్తానని ఎన్టీఆర్లు చాలాసార్లు ప్రకటించినప్పటికీ ఎన్టీఆర్ ఈ సినిమాను తీయలేదు. కృష్ణ చేసిన ప్రకటనను చూసి కోపగించుకున్న ఎన్టీఆర్ దేవుడు చేసిన మనుషులు సినిమా 100 రోజుల వేడుకకు హాజరు కాలేదు.

Advertisement


ఇక అల్లూరి సీతారామరాజు సినిమా కారణంగా పుష్ప ఎన్టీఆర్ మధ్య దూరం మరింత పెరిగింది. ఒక వీరిద్దరి మధ్య చాలా రోజులు మాటలు కూడా లేవు. అయినప్పటికీ ఒకసారి వారా ఈ స్టూడియోస్ లో కృష్ణ, ఎన్టీఆర్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఆ సమయంలో కృష్ణ వెళ్లి పలకరించగానే ఎన్టీఆర్ కూడా మాట్లాడారు. సీతారామరాజు సినిమాను చూసి బాగా తీశావని కృష్ణను ప్రశంసించారు. తర్వాత ఎన్టీఆర్ తీసిన దానవీరశూరకర్ణ సినిమాకు పోటీగా కృష్ణ కురుక్షేత్రం సినిమాను తీశారు. చిత్ర పరిశ్రమ రెండు వర్గాలుగా విడిపోయింది. రెండు చిత్రాలు కూడా 1977లో సంక్రాంతికి పోటా పోటీగా విడుదలయ్యాయి. ఈ సినిమాల తర్వాత అప్పుడప్పుడు వీరిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. కలిసి వయ్యారి భామలు వగలమారి భర్తలు అనే సినిమాలో కూడా నటించారు.                     Also Read :  కొత్త బంగారులోకం హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?


ఆ తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లడం టిడిపి స్థాపించడం పార్టీ గుర్తు సైకిల్ ఎంచుకోవడం అన్ని చకచకా జరిగిపోయాయి. అదే సమయంలో కృష్ణ ఈనాడు సినిమాలో రండి కదలి రండి అనే పాట సైకిల్ మీద తీయడంతో ఎన్టీఆర్కు మద్దతుగా అలా తీసారేమో అని అందరూ అనుకున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సహకారంతో నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి కాగానే ఆయనను అభినందిస్తూ కృష్ణ ప్రకటనలు చేయడంతో అప్పుడు పెద్ద దుమారమే రేగింది. అభిమానులు ఆగ్రహంతో కృష్ణ సినిమాలు ప్రదర్శిస్తున్న థియేటర్ల పై దాడి చేశారు. కృష్ణ పోస్టర్లను తగలబెట్టారు. వెంటనే కృష్ణ మల్సటిరోజే నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా వారికి నా అభినందనలు తెల్పడమే నా అలవాటు అని చెప్పారు. 1984లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ సలహా మేరకు కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వ్యతిరేకంగా రాజకీయ వ్యంగ్య చిత్రాలను కూడా తీశారు. రాజీవ్ గాంధీ మరణించిన తర్వాత వీరిద్దరి మధ్య ఎటువంటి గొడవలు జరగలేదు. కృష్ణ ఎన్టీఆర్ మధ్య ఉన్న గొడవల సంబంధాలు ఇవే అండి.                                                                                                                                                              Also Read :  “పొన్నియన్ సెల్వన్” సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోలు…! అందులో ఒకరు టాలీవుడ్ స్టార్ కూడా ఉన్నారని తెలుసా…!

Visitors Are Also Reading