Home » వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల్లో నటించి శృతి తప్పు చేసిందా..?

వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల్లో నటించి శృతి తప్పు చేసిందా..?

by AJAY
Ad

టాలీవుడ్ లోని స్టార్ హీరోయిన్ లలో శృతిహాసన్ ఒకరు. కమల్ హాసన్ నట వారసురాలిగా శృతి చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. తెలుగు తమిళ భాషల్లో సినిమాలు చేసింది. అయితే టాలీవుడ్ లోనే ఎక్కువ ఆఫర్ లను అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే శృతిహాసన్ బాలయ్య, చిరంజీవి లాంటి సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తుంది.

Advertisement

రీసెంట్ గా సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ సినిమా వీరసింహారెడ్డి లో హీరోయిన్ గా నటించింది. అదేవిధంగా చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. రెండు సినిమాలకు భారీ కలెక్షన్ లు వస్తున్నాయి.

Advertisement

అయితే సినిమాలు మంచి విజయం సాధించినప్పటికీ శృతిహాసన్ పేరు మాత్రం ఎక్కడా వినిపించడం లేదు. నిజానికి హీరోయిన్ గా ఒక సూపర్ హిట్ అందుకుంటే ఆ తర్వాత వరుస ఆఫర్ లు వస్తుంటాయి. అంతేకాకుండా హీరోయిన్ పేరు సైతం మార్మోగిపోతుంది. కానీ ఈ ఏడాది సంక్రాంతికి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించినా కూడా శృతిహాసన్ పేరు మాత్రం ఎక్కడా వినిపించడం లేదు.

దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. వీర సింహారెడ్డి… వాల్తేరు వీరయ్య రెండు సినిమాల్లోనూ హీరోయిన్ పాత్ర పరిధి చాలా తక్కువగా ఉంది. దాంతో హీరోయిన్ పర్ఫామెన్స్ కు సైతం స్కోప్ తక్కువగానే ఉంది. ఇక స్క్రీన్ స్పేస్ తక్కువ కావడంతో శృతిహాసన్ పేరు బయటకు వినిపించడం లేదు. అంతేకాకుండా ఇలాంటి సినిమాలు చేస్తే శృతిహాసన్ కెరీర్ పైనే ఎఫెక్ట్ పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పుడు అయినా శ్రుతి జాగ్రత్త పడుతుందా లేదా అన్నది చూడాలి.

Visitors Are Also Reading