Home » సౌందర్య మరణించడం స్నేహకు కలిసొచ్చిందా..?

సౌందర్య మరణించడం స్నేహకు కలిసొచ్చిందా..?

by Azhar
Ad

అందం, అభినయం ఉన్న ప్రస్తుత హీరోయిన్ సాయి పల్లవి అయితే ఒక్కపటి హీరోయిన్ సౌందర్య. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో సౌందర్య నటించింది. దాదాపు తన కాలంలో ఉన్న ప్రతి హీరోతో నటించి సౌందర్య ,ఎంచి విజయాలను అందుకుంది. నటనతోనే కాకుండా తన మంచి తనంతో కూడా అభిమానుల మనస్సులో స్థానం సంపాదించింది. కానీ 2004 ఏప్రిల్ 17న హెలికాఫ్టర్ ప్రమాదంలో ఎవరు హూయించని విధంగా ఆమె మరణించడం అభిమానులను కలిచి వేసింది.

Advertisement

అయితే సౌందర్య మరణించడం మరో హీరోయిన్ స్నేహకు బాగా కలిసివచ్చింది అనే వార్తలు బాగానే వచ్చాయి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా మన అన్ని దక్షిణాది భాషలో నటించింది స్నేహ. 2000 సంవత్సరంలో మలయాళం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన స్నేహ ఆ తర్వాత ఏడాదే ప్రియమైన నీకు అని తరుణ్ హీరోగా వచ్చిన సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అయితే స్నేహ రాగానే ఈమె కొంచెం సౌందర్యలా కనిపిస్తుంది అని.. ఆ ముఖంలో అమాయకత్వం అలానే ఉంది అని చాల మంది అన్నారు.

Advertisement

కానీ అకస్మాత్తుగా 2004 లో సౌందర్య చనిపోయిన తర్వాత స్నేహకు అవకాశాలు పెరిగాయి. సౌందర్య మరణించడం స్నేహకు బాగా కలిసి వచ్చింది అనే వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన స్నేహ ఈ విషయం పై స్పందిస్తూ.. అందులో ఎటువంటి నిజం లేదు అని తెలిపింది. నేను సౌందర్య గారికి పెద్ద అభిమానిని. ఆమె మరణవార్త నేను ఓ షూటింగ్ లో ఉండగా విని చాల బాధపడ్డాను. ఇక మన ఇండస్ట్రీలో ఎవరి స్థానం వారికీ ఉంటుంది. కాబట్టి సౌందర్య గారి స్థానం నేనే కాదు ఎవరు తీసుకోలేరు అని స్నేహ పేర్కొంది.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ కెప్టెన్ అయితే ఆర్సీబీ పని గోవిందా.. గోవిందా..?

అర్జున్ టెండూల్కర్ ను ఆ ముంబై పట్టించుకోలేదు.. ఈ ముంబై పట్టించుకోలేదు..!

Visitors Are Also Reading