Home » చిరంజీవి, బాల‌కృష్ణ‌ల‌ను నిర్మాత దిల్ రాజు భ‌య‌పెడుతున్నారా..! ఎందుకంటే ?

చిరంజీవి, బాల‌కృష్ణ‌ల‌ను నిర్మాత దిల్ రాజు భ‌య‌పెడుతున్నారా..! ఎందుకంటే ?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’  నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహా రెడ్డిస రెండు సినిమాలు  వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఒకరోజు అటు ఇటుగా ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద తలపడేందుకు రెడీ అవుతున్నాయి. భారీ అంచనాల మ‌ధ్య‌ రూపొందిన ఈ రెండు సినిమాలు కూడా ఒకేసారి విడుదలవ్వ‌డంతో  థియేటర్ల సమస్య వచ్చే అవకాశాలున్నాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

సాధార‌ణంగా సంక్రాంతి పండుగ  అంటే తెలుగు సినిమాల‌కు పెద్ద సీజన్. ఆ సీజన్ లో కాస్త తక్కువ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా తప్పకుండా మంచి ఫలితం దక్కుతుంది అంటూ చాలామంది నమ్ముతుంటారు. గతంలో ఈ ఇద్దరు హీరోలు కూడా సంక్రాంతి బరిలో నిలిచి సక్సెస్ అయ్యారు. ఈసారి కూడా తప్పకుండా సక్సెస్ అవుతారని అంతా భావిస్తున్నారు. ఈ ఇద్ద‌రూ హీరోల‌తో పాటు పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్ న‌టించిన ఆదిపురుష్ సినిమా కూడా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూష‌న్‌లో విడుద‌ల చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Also Read : బ్రిట‌న్ ప్ర‌ధాని రిషిసునాక్ భార్య ఎవ‌రో తెలుసా..? ఎలా ఒక్కటయ్యారంటే..?

Advertisement

మొత్తానికీ ఈసారి ఈ ఇద్దరూ స్టార్  హీరోలను ప్రముఖ నిర్మాత దిల్ రాజు భయపెడుతున్నాడంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ సింగిల్ స్క్రీన్ థియేటర్లు,  మల్టీప్లెక్స్ లు నిర్మాత‌ దిల్ రాజు ఆధ్వర్యంలోనే న‌డుస్తుంటాయి. ఆయన ఏ సినిమాకు చెబితే ఆ సినిమా కోసం స్క్రీన్ కేటాయించడం జరుగుతుంది.ఆయనతో మచ్చిక చేసుకుని తమ సినిమాలను ఆయన ద్వారా విడుదల చేసేందుకు చాలా మంది పెద్ద హీరోల సినిమాల నిర్మాతల నుంచి చిన్న సినిమాల నిర్మాతల వరకు ప్రయత్నాలు చేస్తుంటారు.

Also Read :  సమంత ఆ పార్ట్ కు సర్జరీ చేసుకుందా…? నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు…!

మ‌రోవైపు సంక్రాంతికి ఆయ‌న  భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సూపర్ స్టార్ విజయ్ వారసుడు సినిమా కూడా తెలుగులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా కోసం  కొన్ని మెజార్టీ థియేటర్లను, ఆదిపురుష్ కోసం దిల్ రాజు ముంద‌స్తుగానే  బుక్ చేసి  పెట్టేసాడని టాక్ వినిపిస్తోంది. ఇక  ఆ థియేటర్లను బ్లాక్ చేయడం వల్ల ఇప్పుడు వాల్తేరు వీర‌య్య‌, వీర‌సింహారెడ్డి సినిమాలకు థియేటర్లు కరువయ్యాయి అంటూ మెగా, నందమూరి  అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ చివరి వరకు కూడా దిల్ రాజు థియేటర్లను ఇవ్వకపోతే తమ సినిమాలను వాయిదా వేసుకోవాల్సిన  పరిస్థితి వస్తుంది అంటూ చిరంజీవి, బాలకృష్ణ ఇద్ద‌రూ హీరోలు ఆందోళ‌న‌లో ఉన్నార‌ని టాక్ వినిపిస్తోంది. అందులో వాస్త‌వం ఉందో లేదో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.

Also Read : ఆ టాలీవుడ్ హీరోతో నటించాలని ఉందంటున్న‌ జాన్వి కపూర్..!

 

Visitors Are Also Reading