Home » వాట‌ర్ బాటిల్స్ ద్వారా ఎక్కువగా సంపాదిస్తున్న రైల్వే!

వాట‌ర్ బాటిల్స్ ద్వారా ఎక్కువగా సంపాదిస్తున్న రైల్వే!

by Azhar

రైల్వేస్ త‌మ టికెట్స్ ద్వారా ఎక్కువ‌గా సంపాదిస్తుంది అనుకుంటాము. నిజానికి రైల్వైస్ టికెట్స్ కంటే కూడా ఆ రైళ్ల‌లో ప్ర‌యాణించే ప్ర‌యాణికులు తిన‌డానికి అమ్మే ప‌దార్థాల ద్వారా ఎక్కువ డ‌బ్బును సంపాదిస్తుంది. ఇక ఈ మ‌ద్య రైళ్ల‌లో కేవ‌లం రైల్వే నీర్ ను అమ్ముతున్నారు. దీని ద్వారా కూడా మంచి ఆదాయాన్ని రాబ‌డుతుంది రైల్వేస్.

IRCTC కి వ‌చ్చే ఆదాయం

  • ఫుడ్ స‌ర్వీస్ ద్వారా ….45.89 %
  • టికెట్స్ ద్వారా ……. 27.20%
  • టూరిజం ద్వారా ….12.96%
  • తీర్థ యాత్ర‌ల‌కు ప్ర‌త్యేక ట్రైన్స్ న‌డ‌ప‌డం ద్వారా …..4.19%
  • రైల్ నీర్ పేరుతో వాట‌ర్ బాటిల్స్ అమ్మ‌డం ద్వారా… 9.76

 

రైల్ నీర్ : 2003 లో ట్రైన్ లో ప్ర‌యాణించే ప్ర‌యాణికుల‌కు నీరు అందించే ప్ర‌య‌త్నంలో భాగంగా ఢిల్లీ నిజాముద్దీన్ ట్రైన్ లో ఈ రైల్ నీర్ కాన్సెప్ట్ ను స్టార్ట్ చేశారు. త‌ర్వాత‌ర్వాత అన్ని ట్రైన్స్ కి ఈ వాట‌ర్ బాటిల్స్ ను స‌ప్లై చేయ‌డం ప్రారంభించారు. ప్ర‌స్తుతానికి IRCTC ఏర్పాటు చేసుకున్న 10 ప్లాంట్ల ద్వారా 11 ల‌క్ష‌ల లీట‌ర్ల వాట‌ర్ స‌ప్లై చేస్తున్నారు. డిమాండ్ మాత్రం రోజుకు 19 ల‌క్ష‌ల లీట‌ర్లుగా ఉంది. అందుకే త్వ‌ర‌లో మ‌రిన్ని వాట‌ర్ ప్లాంట్ ల‌ను నెల‌కొల్పేప‌నిలో ఉంది రైల్వే సంస్థ‌.

 

Visitors Are Also Reading