Home » త‌మ ఒంటి పేరే సినిమా పేరుగా వ‌చ్చి చిత్రాలు ఎలా ఆడాయో తెలుసా..?

త‌మ ఒంటి పేరే సినిమా పేరుగా వ‌చ్చి చిత్రాలు ఎలా ఆడాయో తెలుసా..?

by Bunty
Ad

సినిమా విజ‌యంతం అవ్వ‌డంలో క‌థ ప్ర‌ధాన పాత్ర పోషిస్తే.. ఆ చిత్రానికి త‌గిన టైటిల్ లేక‌పోతే సినిమా ప్ర‌జ‌ల్లోకి అంత తొంద‌ర‌గా వెళ్ల‌లేదు. అభిమాన హీరో, అభిమాన హీరోయిన్ ఉంటేనే దానికి త‌గిన‌టువంటి టైటిల్ ఉన్న‌ప్పుడే ఆ సినిమా విజ‌య‌వంతమ‌వుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే సినిమా టైటిల్ నిర్ణ‌యించ‌డంలో ఒక్కొక్క‌రూ ఒక ప‌ద్ద‌తిని అనుస‌రిస్తూ ఉంటారు. ఆ విధంగా త‌మ ఒంటి పేరుగా వ‌చ్చిన ఇద్ద‌రు స్టార్ హీరోల చిత్రాలున్నాయి.

 

Advertisement

1980 ద‌శ‌కంలో వ‌చ్చిన హీరోలు మెగాస్టార్‌ చిరంజీవి, యువ‌సామ్రాట్‌ నాగార్జున చిత్రాలున్నాయి. మ‌న ఊరి పాండ‌వులు, న్యాయంకావాలి, ఖైదీ లాంటి విజ‌య‌వంతం అయిన చిత్రాల‌తో దూసుకెళ్లుతున్న సుప్రీం హీరో చిరంజీవి. 1985 అజ‌య్ క్రియేష‌న్స్, సీవీ రాజేంద్రన్ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి చిత్రం విడుద‌ల అయింది. ఈ సినిమాలో చిరంజీవి, విజ‌య‌శాంతి హీరో, హీరోయిన్‌లుగా న‌టించారు. చ‌క్ర‌వ‌ర్తి ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. చిరంజీవి, విజ‌య‌శాంతి క‌లిసి న‌టించిన ఈ చిత్రం మంచి అంచెనాల‌తో వ‌చ్చి బాక్సాపీస్ వ‌ద్ద అంత‌గా ఆక‌ట్టుకోలేదు.

Advertisement

 

1986లో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు త‌న కుమారుడిని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ.. అన్న‌పూర్ణ బ్యాన‌ర్ వి.మ‌ధుసూద‌న్‌రావు ద‌ర్శ‌క‌త్వంలో విక్ర‌మ్ చిత్రం విడుద‌ల అయింది. ఈ సినిమాలో నాగార్జున‌, శోభ‌న హీరో, హీరోయిన్లుగా న‌టించారు. నాగార్జున తొలి సినిమా అప‌జ‌యం పాలైంది. ఆ త‌రువాత జ‌గ‌ప‌తి ఆర్ట్స్ పిక్చ‌ర్ వీ.బీ. రాజేంద్ర‌ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వంలో కెప్టెన్ నాగార్జున్ చిత్రం విడుద‌లైంది. నాగార్జున‌, కుష్బూ హీరో, హీరోయిన్‌లుగా న‌టించారు. ఈ చిత్రంలో మ‌రొక ప్ర‌ధాన పాత్ర‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్ కూడా న‌టించారు. నాగార్జున త‌న కెరీలో విమాన ఫైలెట్‌గా న‌టించిన ఒకే ఒక చిత్రం కెప్టెన్ నాగార్జున్ మొద‌టి సారి నాగార్జున‌, ఖుష్బూ న‌టించిన ఈ సినిమా ప‌రాజ‌యం పాలైంది. అయితే చిరంజీవి, నాగార్జున ఇద్ద‌రూ త‌మ ఒంటిపేరు సినిమా పేరుగా వ‌చ్చిన చిత్రాలు బాక్సాపీస్ వ‌ద్ద ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూశాయి.

read more .. వీజే స‌న్నీని మాధ‌వీల‌త ఏమ‌న్న‌దో తెలుసా..?

Visitors Are Also Reading