Home » మ‌ళ్లీ క‌ల‌వ‌బోతున్న చైసామ్…త్వ‌ర‌లోనే విడాకుల ర‌ద్దు..?

మ‌ళ్లీ క‌ల‌వ‌బోతున్న చైసామ్…త్వ‌ర‌లోనే విడాకుల ర‌ద్దు..?

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత… హీరో అక్కినేని నాగచైతన్య గత ఏడాది డిసెంబర్ లో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 7 ఏళ్లపాటు ప్రేమలో మునిగితేలిన‌ ఈ జంట 2017లో గోవాలో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే పెళ్లయిన కొన్నేళ్లకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తినట్టు తెలుస్తోంది. అయితే విడాకులకు కారణం ఏంటన్నది ఇప్పటివరకు సమంత గానీ నాగచైతన్య కానీ వెల్లడించలేదు.

Also Read:   న‌మ్ర‌త తండ్రి ఓ స్టార్ క్రికెట‌ర్ అన్న సంగ‌తి తెలుసా..? ఆయ‌న ఎవ‌రంటే..?

Advertisement

అయితే పలు ఇంటర్వ్యూలలో సమంత మాత్రం నాగచైతన్య పై ఉన్న కోపాన్ని బయటపెట్టింది. మ‌రోవైపు ఇద్ద‌రూ విడాకుల త‌ర‌వాత ఎవ‌రి సినిమాల‌తో వాళ్లు ఫుట్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి బారిన పడ్డారు. దాంతో కొంత కాలం పాటూ సినిమా షూటింగ్ ల‌కు బ్రేక్ తీసుకున్నారు. కేవ‌లం సినిమాల నుండి మాత్ర‌మే కాకుండా సోష‌ల్ మీడియా నుండి సైతం స‌మంత బ్రేక్ తీసుకున్నారు.

Advertisement

Also Read:  ఉదయ్ కిరణ్ ఆకస్మిక మరణానికి కారణమేమిటో తెలుసు నిజాలన్నీ బయటపెడతా !

ఆరోగ్యం మెరుగుపడిన త‌ర‌వాత‌ సమంత యశోద సినిమా డబ్బింగ్ ను పూర్తి చేశారు. ఇప్ప‌టికే ఈ సినిమా విడుదల కాగా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇక‌ ప్రస్తుతం సమంత చికిత్స తీసుకుని కొంతమేర కోలుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఆసక్తికర వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

సమంత అనారోగ్యం బారిన పడినప్పటినుండి అక్కినేని ఫ్యామిలీ ఆమెకు అండగా నిలిచిందని వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో నాగచైతన్య….నాగార్జున ఎలాంటి పోస్టులు పెట్టకపోయినప్పటికీ పర్సనల్ గా సమంత ఆరోగ్య పరిస్థితి పై వాళ్లు ఆరా తీసినట్టు తెలుస్తోంది. దాంతో వాళ్లు త‌నపై చూపించిన కేరింగ్ వ‌ల్ల స‌మంత విడాకుల‌ను క్యాన్సిల్ చేసుకుని మ‌ళ్లీ చైతూతో క‌ల‌వ‌బోతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ వార్త‌లు ఎంత వ‌ర‌కూ నిజం అవుతాయో చూడాలి.

Also Read:   త్రివిక్రమ్ నమ్మించి మోసం చేశాడంటున్న నటి ప్రేమ.. కారణం..!!

Visitors Are Also Reading