ప్రముఖ సినీ నటుడు, మాస్ మహారాజా రవితేజ తన సినిమా చిత్రీకరణ సమయంలో గాయాల పాలయ్యారు. మోకాలికి బలమైన గాయం తగలడం వల్ల సుమారు 10 కుట్లు పడ్డట్టు సమాచారం. టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్లో కొద్ది రోజుల కిందట ఈ ఘటన చోటు చేసుకోగా.. తాజాగా బయటికి వచ్చింది.
Advertisement
రవితేజ హీరోగా నటిస్తున్న సినిమాలో ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో రవితేజ పట్టుకున్న తాడు జారిపోయింది. దీంతో ప్రమాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. ఇక పూర్తిగా విశ్రాంతి తీసుకోకుండా రవితేజ గురువారం సినిమా షూటింగ్ లో పాల్గొన్నారట. తన కారణంగా ఇతర నటుల, సాంకేతిక నిపుణుల తేదీల మార్పు రాకూడదని.. నిర్మాత ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆయన ఇలా చేసారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
Advertisement
స్టువర్ట్పురం గజదొంగ జీవిత ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. 1970 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని గెటప్లో కనిపించనున్నారు రవితేజ. దొంగాట ఫేం వంశీ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇక పాన్ ఇండియా స్టాయిలో ఈ చిత్రం విడుదల కానున్నది. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక మరొకవైపు రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటి చిత్రం కూడా విడుదలకు సిద్ధంగానే ఉంది. దీంతో పాటు ధమాకా, రావణాసుర సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. రవితేజ వరుసగా సినిమాలు చేస్తున్న తరుణంలో గాయంతో కూడా ఇవాళ సినిమా షూటింగ్లో పాల్గొనడంతో పలువురు రవితేజను అభినందిస్తున్నారు.
Also Read :
ఎయిడ్స్ వ్యాధి నివారణకు మందు వచ్చేసిట్టేనా..?
వచ్చే నెలలో ఈ మూడు రాశుల వారి బ్యాంకు బ్యాలెన్స్ పెరిగే ఛాన్స్..!