Home » విమానంలో అవమానం… ట్విట్టర్ లో చెప్పేసిన పూజా…!

విమానంలో అవమానం… ట్విట్టర్ లో చెప్పేసిన పూజా…!

by Azhar
Ad
ప్రస్తుతము మన తెలుగులో టాప్ హీరో ఎవరు అనే ప్రశ్నకు సంబంధించిన రేసులో చాలా పేర్లు వినిపిస్తాయి. కానీ టాప్ హీరోయిన్ ఎవరు అనే ప్రశ్నకు మాత్రం చాలా తక్కువ సమాధానాలే ఉంటాయి. అందులో పూజా హెగ్డే కూడా ఒక్కరు. అయితే తెలుగులో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నరించిన మొదటి సినిమా ముకుంద తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూజా ఆ తర్వాత వరుసవాక్షాలు అందుకుంది. ఇక ఏ ఈమధ్య బన్నీతో నటించిన అల వైకుంఠపురం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది.
అయితే ఇంత స్టార్ హీరోయిన్ కావడంతో పూజా షూటింగ్ కోసం కావచ్చు లేక వేరే విషయాల కోసం కావచ్చు ఎక్కువగా విమాన ప్రయాణాలు చేస్తూ ఉంటుంది. ఇక ఈరోజు చేసిన ఓ విమాన ప్రయాణం మాత్రం ఆమెకు జీవితాంతం గుర్తుంటుంది. ఎందుకంటే ఇందులో పూజకు అవమానము జరిగిందట..!  ఈ విషయాన్ని తాజాగా ఆమె స్వయంగా తన ట్విట్టర్ వేదికగా బయట పెట్టింది.
అందులో.. ఎంత మొరటుగా ఉన్నాడో చాలా బాధగా ఉంది. ఇండిగో6ఈ సిబ్బంది, విపుల్ నకాషే అనే వ్యక్తి ఈ రోజు ముంబై నుండి బయలుదేరిన మా విమానంలో మాతో చాలా మొరటుగా ప్రవర్తించాడు. ఎటువంటి కారణం లేకుండా అతను మాతో పూర్తిగా అహంకారం, అజ్ఞానం మరియు బెదిరింపు టోన్ లో మాట్లాడాడు. సాధారణంగా నేను ఈ సమస్యల గురించి ట్వీట్ చేయను, కానీ ఇది నిజంగా భయంకరంగా ఉంది అంటూ పేర్కొంది. అయితే పూజా చేసిన ఈ ట్విట్ పై అభిమానులు కొంత నెగెటివ్ గానే స్పందిస్తున్నారు. మీరు ఎంత పెద్ద హీరోయిన్ అయిన ఫ్లైట్ లో అందరూ సమానమే అని ఒక్కరు అంటుంటే.. మీరు ఇలా అతని పేరు బయట పెట్టడం చాలా తప్పు అని ఇంకొందరు కామెంట్స్ చేస్థున్నారు.

Advertisement

Visitors Are Also Reading