Home » అద్భుతమైన ఘటన ఒకే జట్టులో ఇండియా, పాకిస్థాన్ ఆటగాళ్లు…!

అద్భుతమైన ఘటన ఒకే జట్టులో ఇండియా, పాకిస్థాన్ ఆటగాళ్లు…!

by Azhar
Published: Last Updated on
Ad

ఇండియా vs పాకిస్థాన్ అంటేనే చాలు.. అది ఏ మ్యాచ్ అయిన.. ఎక్కడైనా అభిమానుల మధ్య ఉండే హైపే వేరు. అయితే ఈ రెండు జట్లు క్రికెట్ లో ఎదురుపడితే… ఆ మ్యాచ్ కు వచ్చే టిఆర్పి మరో రేంజ్ లో ఉంటుంది. కానీ ఈ జట్లు కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే ఇప్పుడు పోటీ పడుతుండటంతో.. అభిమానులు కనీసం రెండేళ్లు ఎదురు చూడాల్సి వస్తుంది. ఒకవేళ ఈ రెండు జట్లలోని ఆటగాళ్లు కలిసి ఒక్కే జట్టుకు ఆడితే ఎలా ఉంటుంది. చాలా ఎల్లా తర్వాత ఇప్పుడు అలాంటి ఘటనా చోటు చేసుకుంది.

Advertisement

భారత టెస్ట్ స్టార్ ఆటగాడు పుజారా, ప్రస్తుతం కొంత ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఆ కారణంగానే ఐపీఎల్ 2021 వేలంలో అమ్ముడుపోయిన పుజారా… 2022 మెగావేలంలో మాత్రం అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు. దాంతో పోయిన తన ఫామ్ ను తెచ్చుకోవడానికి ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ లో పాల్గొంటున్నాడు. ఇక్కడే ఆ అద్భుతం జరిగింది.

Advertisement

కౌంటీ క్రికెట్ లో పుజారా ఏ జట్టుకు అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నాడో.. అదే జట్టుకు పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ కూడా ఆడుతున్నాడు. దాంతో చాలా సంవత్సరాల తర్వాత ఇలా భారత్, పాక్ ఆటగాళ్లు ఒక్కే జట్టుకు ఆడతున్నాడు. వీరిద్దరూ కౌంటీ క్రికెట్ కోసం సక్సెస్ జట్టు తరఫున ఈ ఏడాదే అరంగేట్రం చేస్తున్నారు. ఇక తాజాగా వీరిద్దరూ ఉన్న ఫోటోను సక్సెస్ జట్టు సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది కాస్త వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి :

ధోని ముందే హెలికాప్టర్ షాట్ ఆడిన సిరాజ్..!

ఆర్సీబీ టైటిల్ గెలిచే వరకు పెళ్లి చేసుకోను.. అయితే అంతే సంగతి..!

Visitors Are Also Reading