Home » Russia Ukraine War : ర‌ష్యా దాడుల్లో భార‌త విద్యార్థి మృతి

Russia Ukraine War : ర‌ష్యా దాడుల్లో భార‌త విద్యార్థి మృతి

by Anji
Ad

ఉక్రెయిన్ ర‌ష్యా జ‌రుపుతున్న దాడుల్లో ఉక్రెయిన్ సైనికుల‌తో పాటు సాధార‌ణ ప్ర‌జ‌లు కూడా మ‌ర‌ణిస్తూ ఉన్నారు. ఇరు దేశాల యుద్ధం ప్రారంభ‌మై మంగ‌ళ‌వారం నాటికి ఆరు రోజులు గ‌డిచాయి. అయినా యుద్ధం మాత్రం ఆగ‌డం లేదు. రోజు రోజుకు యుద్ధం తీవ్ర‌త పెరుగుతోంది. ఈ త‌రునంలో మంగ‌ళ‌వారం ఉక్రెయిన్‌పై ర‌ష్యా చేసిన దాడుల్లో భార‌త్‌కు చెందిన ఒక విద్యార్థి మృతి చెందాడు. రెండ‌వ అతి పెద్ద న‌గ‌ర‌మైన ఖ‌ర్కీవ్‌లో ర‌ష్యా మిస్సైల్ దాడిలో క‌ర్ణాట‌క‌కు చెందిన మెడిక‌ల్ విద్యార్థి న‌వీన్ మ‌ర‌ణించాడు.

Advertisement

Advertisement

భార‌త విద్యార్థి న‌వీన్ ఆహారం కోసం బ‌య‌ట‌కి వెళ్లిన స‌మ‌యంలో అక్క‌డి గ‌వ‌ర్న‌ర్ హౌస్, సిటీ హాల్‌పై ర‌ష్యా మిలిట‌రీ మిస్సైల్ దాడి జ‌రిపింది. దీంతో ఈ దాడిలో న‌వీన్ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. వైద్య విద్య కోసం వేలాది మంది విద్యార్థులు ఉక్రెయిన్ కు వెళ్లారు. తెలుగు రాష్ట్రాల‌కు చెందిన చాలా మంది విద్యార్థులు కూడా వైద్య విద్య కోసం ఉక్రెయిన్‌కు వెళ్ల‌గా.. అందులో న‌వీన్ కూడా ఉన్నాడు. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తు అత‌డు ర‌ష్యా సైనికుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఇంకా 3-4 వేల మంది భార‌తీయులు ఖ‌ర్కీవ్‌లోనే చిక్కుకున్న‌ట్టు స‌మాచారం.

Also Read :  అఖిల‌ప‌క్ష భేటీ నిర్వ‌హించాలి.. బండి సంజ‌య్ బ‌హిరంగ లేఖ

Visitors Are Also Reading