Home » India vs New Zealand, 2nd ODI : టీమిండియా జైత్ర యాత్ర.. కివీస్ పై 2-0తో వన్డే సిరీస్ కైవసం

India vs New Zealand, 2nd ODI : టీమిండియా జైత్ర యాత్ర.. కివీస్ పై 2-0తో వన్డే సిరీస్ కైవసం

by Bunty
Ad

కొత్త ఏడాది టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే శ్రీలంక పై రెండు సిరీస్ లు గెలిచిన టీమ్ ఇండియా.. ఈ ఏడాది వరసగా రెండో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. శనివారం రాయపూర్ వేదికగా ఏకపక్షంగా సాగిన రెండో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ను చిత్తుచేసింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 2-0 తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.


ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్, 34.3 ఓవర్లలోనే 108 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు మహమ్మద్ షమీ(3/18), హార్దిక్ పాండ్యా(2/16), వాషింగ్టన్ సుందర్(2/7) విజృంభించడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. గ్లేన్ ఫిలిప్స్(52 బంతుల్లో 5 ఫోర్లతో 36), మైఖేల్ బ్రేస్ వెల్(30 బంతుల్లో 4 ఫోర్లతో 22) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

Advertisement

Advertisement


అనంతరం లక్ష్యచేదనకు దిగిన టీమిండియా 20.1 ఓవర్లలో 2 వికెట్లకు 111 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ 50 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ లతో, హాఫ్ సెంచరీ తో రాణించగా, గిల్ 53 బంతుల్లో 6 ఫోర్లతో 40 నాట్ అవుట్ గా నిలిచి విజయలాంచనాన్ని పూర్తి చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో షిప్లే, సాంట్నర్ తలో వికెట్ తీశారు. కాగా, ఈ నెల 24 వ తేదీన చివరి వన్డే జరుగనుంది.

Read Also : Ananta Sriram : వివాదంలో ఇరుక్కున్న అనంత్ శ్రీరామ్, ఆ కులస్తులను అవమానించారని..

Visitors Are Also Reading