Home » ఫైనల్ లో తలపడనున్న ఇండియా, పాకిస్థాన్..?

ఫైనల్ లో తలపడనున్న ఇండియా, పాకిస్థాన్..?

by Azhar

టీ20 ప్రపంచ కప్ అనేది 2007 లో ప్రారంభమైన మొదటిసారే దాయాధి దేశాలు అయిన ఇండియా, పాకిస్థాన్ జట్లు ఫైనల్ కు చేరాయి. అయితే అందులో ఇండియా విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ఇక మళ్ళీ ఇన్ని ఏళ్లకు ఇండియా, పాక్ జట్లు అనేవి పొట్టి ప్రపంచ కప్ ఫైనల్స్ కు వెళ్లనున్నట్లు కనిపిస్తుంది.

అయితే సూపర్ 12 లో మొదటి రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన పాకిస్థాన్ సెమీస్ కు వస్తుంది అని ఎవరు అనుకోలేదు. కానీ ఈరోజు సౌత్ ఆఫ్రికా ఓటమితో ఆ జట్టు గ్రూప్ బిలో 2వ స్థానంలో సెమీస్ చేరింది. అలాగే ఇండియా కూడా గ్రూప్ టాపర్ గా సెమీస్ కు వచ్చింది. ఇక గ్రూప్ ఏలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ సెమీస్ కు వచ్చాయి. కాబట్టి మనకు ఇంగ్లాండ్ తో.. పాకిస్థాన్ న్యూజిలాండ్ తో సెమీస్ మ్యాచ్ లు జరగనున్నాయి.

ఇక ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఫలితాలు అనేవి చూస్తే ఇండియాకు అలాగే పాకిస్థాన్ కు తమ ప్రత్యర్థి జట్ల పైన మంచి రికార్డులు ఉన్నాయి. చివరగా ఇంగ్లాండ్ ను వారి దేశంలోనే ఇండియా ఓడిస్తే.. పాక్ కివీస్ ను వారి సొంత గడ్డ పై ఓడించింది. కాబట్టి ఈ సెమీస్ లో ఇండియా, పాక్ ఫెవరెట్ గా ఉనందున ఆ రెండు జట్లే ఫైనల్స్ కు వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :

లిటన్ దాస్ కు కోహ్లీ గిఫ్ట్..!

బాబర్ రికార్డ్ బద్దలు కొట్టిన రోహిత్..!

Visitors Are Also Reading