Home » రిషబ్ పంత్ కోలుకోవాలని, 100 కొబ్బరికాయలు కొట్టిన సూర్య!

రిషబ్ పంత్ కోలుకోవాలని, 100 కొబ్బరికాయలు కొట్టిన సూర్య!

by Bunty
Ad

టీమిండియా కీలక ఆటగాడు, వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ఇటీవలే కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయన అభిమానులంతా ఆందోళనలో ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఉత్తరాఖండ్ లోని రూర్కీ ప్రాంతంలో రిషబ్ కారు ప్రమాదానికి గురై మంటల్లో కాలిపోయింది. ఢిల్లీ వైపు నుంచి వేగంగా వచ్చిన కారు డివైడర్ ను ఢీ కొట్టి 200 మీటర్ల దూరం దూసుకెళ్లింది. దీంతో కారులో మంటలు చెలరేగడంతో సమయస్ఫూర్తితో పంత్ కారు నుంచి బయటకు వచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

Advertisement

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కాస్త నిలకడగానే ఉందని బిసిసిఐ తెలియజేసింది. తీవ్రమైన గాయాలైనప్పటికీ పంత్ కోలుకుంటాడని తెలిపింది. ఇది ఇలా ఉండగా,టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్ వన్డే సిరీస్ తో బిజీ బిజీగా ఉంది. 3 వన్డే మ్యాచ్ ఎలా సిరీస్ లో భాగంగా, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక నామమాత్రపు మ్యాచ్ అయిన చివరి వన్డే కోసం టీమిండియా మధ్యప్రదేశ్ వెళ్ళింది. మంగళవారం ఈ మ్యాచ్ జరగనుండటంతో ఆటగాళ్లకు కొంత సమయం లభించింది.

Advertisement

ఈ సమయాన్ని తమ టీం మేట్ అయిన రిషబ్ పంత్ కోసం వినియోగించారు. టీమ్ ఇండియా క్రికెటర్లు సూర్యకుమారి యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ లు సోమవారం మధ్యప్రదేశ్ లోని ప్రముఖ ఆలయమైన ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కారు ప్రమాదంలో గాయపడ్డ పంట త్వరగా కోలుకోవాలని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం ఈ పూజలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అటు పంత్ కోలుకోవాలని 100 కొబ్బరికాయలు కొట్టాడట సూర్య.

READ ALSO : JEE Main Exam: జేఈఈ మెయిన్ పరీక్షలకు సర్వం సిద్ధం… హాజరుకారున్న 11 లక్షల మంది విద్యార్థులు!

Visitors Are Also Reading