Home » మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ అప్పు ఎంత పెరిగిందో తెలుసా ?

మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ అప్పు ఎంత పెరిగిందో తెలుసా ?

by Bunty
Ad

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం భారతదేశ అప్పులు విపరీతంగా పెరిగాయని లెక్కలు చెబుతున్నాయి. సామాజిక కార్యకర్త ఇనుగంటి రవికుమార్ సహ చట్టం కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం… అప్పుల వివరాలను పేర్కొంది. ఈ లెక్క ప్రకారం.. 2014 -15 నాటికి దేశం ఇక అప్పు.. రూ.62,42,220.92 కోట్లు ఉండగా..2021-22 బడ్జెట్ నాటికి అది రూ.1,35,86,975.52 కోట్లకు చేరింది.

Advertisement

అంటే మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడు సంవత్సరాలలో 117 శాతానికి పెరిగింది అన్నమాట. అరవై నాలుగు సంవత్సరాలలో దేశం అప్పు 62 లక్షల కోట్లు కాగా… మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ 7 ఏళ్ల లోనే కొత్తగా రూ.73,44,754 కోట్ల అప్పు చేసినట్లు ఈ సమాచారం ద్వారా వెల్లడయింది. 1950-51 లో దేశ అంతర్గత రుణం రెండు వేల కోట్లు కాగా విదేశీ రుణం 32 కోట్ల మేర ఉండేది.

Advertisement

 

అయితే 2021-22 నాటికి అంతర్గత రుణం రూ.1,13,57,415 కోట్లు కాగా విదేశీ రుణం రూ.4,27,925.24 కోట్లకు ఎగబాకింది. ఏడు దశాబ్దాల క్రితం చమురు మార్కెటింగ్ కంపెనీలు, ఎరువుల కంపెనీలు మరియు ఎఫ్సీఐ కి కింద చెల్లించాల్సిన బకాయిలను ఏమీ లేవు. కానీ మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం వాటి రాయితీల భారం రూ.1,62,827.90 కోట్లకు చేరింది. అయితే గత ఏళ్లలో మోడీ సర్కార్ ఈ మేరకు అప్పులు చేయడం పై కాంగ్రెస్ పార్టీ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు.

Visitors Are Also Reading