Home » IND Vs SL : శ్రీ‌లంక క్రికెట‌ర్లు ప్ర‌యాణించిన బ‌స్సులో బుల్లెట్ల క‌ల‌క‌లం

IND Vs SL : శ్రీ‌లంక క్రికెట‌ర్లు ప్ర‌యాణించిన బ‌స్సులో బుల్లెట్ల క‌ల‌క‌లం

by Anji
Ad

భార‌త్‌-శ్రీ‌లంక జ‌ట్ట మ‌ధ్య మొహ‌లీ వేదిక‌గా జ‌ర‌గాల్సిన తొలి టెస్ట్‌కు ముందు ఓ షాకింగ్ వార్త అందరినీ క‌ల‌వ‌ర‌పెడుతుంది. టీ-20 జ‌ట్టులో లేని లంక ఆట‌గాళ్లు ప్ర‌యాణించిన వాహనంలో రెండు బుల్లెట్ షెల్స్ బ‌య‌ట‌ప‌డ‌డంతో లంక శిబిరంలో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం మొద‌లైంది. లంక క్రికెట‌ర్లు ఓ ప్ర‌యివేటు బ‌స్సులో తాము బ‌స చేస్తున్న ల‌లిత్ హోట‌ల్ నుంచి టెస్ట్ మ్యాచ్ వేదిక అయిన పంజాబ్ క్రికెట్ అసోసియేష‌న్ స్టేడియానికి వెళ్తుండ‌గా మార్గ మ‌ధ్య‌లో జ‌రిగిన సాధార‌ణ పోలీస్ త‌నిఖీల్లో రెండు ఖాళీ బుల్లెట్ షెల్స్ క‌నిపించాయి.

Advertisement

Advertisement

మెట‌ల్ డిటెక్ట‌ర్‌తో త‌నిఖీ చేస్తుండ‌గా.. బ‌స్సు ల‌గేజ్ కంపార్ట్‌మెంట్లో బుల్లెట్లు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. లంక ప్లేయ‌ర్ల కోసం బ‌స్సును అద్దెకు తీసుకోవ‌డానికి ముందు ఓ మ్యారేజ్ ఫంక్ష‌న్ కోసం వాడిన‌ట్టు పోలీసుల విచార‌ణ‌లో తెలిసింది. చండీఘ‌ర్‌లోని తారా బ్ర‌ద‌ర్స్ అనే ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి బ‌స్సు అద్దెకు తీసుకున్నార‌ని తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా.. మొహ‌లీలో జ‌రుగ‌నున్న టెస్ట్ మ్యాచ్ టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీకి వంద‌వ టెస్ట్ కావ‌డంతో పంజాబ్ క్రికెట్ అసోసియేష‌న్ క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేస్తోంది. పంజాబ్‌లో ఇప్ప‌టికీ క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న దృష్ట్యా ఈ మ్యాచ్‌కు ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించ‌బోమ‌ని పీసీఏ వెల్ల‌డించింది.

Also Read :  నిర్మాత‌గా బండ్ల గ‌ణేష్ తీసిన సినిమాలు- వాటి రిజ‌ల్ట్స్

Visitors Are Also Reading