Home » ఐపీఎల్ కంటే తక్కువగా ప్రపంచ కప్ ప్రైజ్‌మనీ..!

ఐపీఎల్ కంటే తక్కువగా ప్రపంచ కప్ ప్రైజ్‌మనీ..!

by Azhar
Ad

ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెలలో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ అనేది ఆరంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో జట్లకు లభించే ప్రైజ్‌మనీ అనే దానిని ఐసీసీ తాజాగా ప్రకటించింది. ప్రపంచ కప్ గ్రూప్ స్టేజీలో ఆడే 12 జట్లు కూడా 40 వేల డాలర్లు ఇస్తారు. ఇక ఇందులో విజయం సాధించి సూపర్ 12 రౌండ్ కు వచ్చే జట్లకు అదనంగా మరో 40 వేల డాలర్లు అనేవి వస్తాయి.

Advertisement

ఇక సూపర్ 12 లో జరిగే మ్యాచ్ లలో విజయం సాధించిన జట్టుకు కూడా 40 వేల డాలర్ల ప్రైజ్‌మనీ అందుతుంది. కానీ ఇందులో నుండి ఇంటికి వెళ్లిపోయే 8 జట్లకు 70 వేల డాలర్లు అనేవిస్ వస్తాయి. మిగిలిన నాలుగు జట్లు సెమీఫైనల్స్ లో ఆడుతాయి. అయితే ఈ సెమిస్ లో ఓడి ఇంటికి వెళ్లే రెండు జట్లకు 4 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ వస్తుంది.

Advertisement

అదే విధంగా ఫైనల్ లో ఓడి రన్నరప్ గా నిలిచిన జట్టుకు 8 లక్షల డాలర్లు.. విజయం సాధించి ఛాంపియన్ గా నిలిచిన జట్టుకు ట్రోఫీతో పాటుగా 16 లక్షల డాలర్లు అనేవి ప్రైజ్‌మనీగా అందుతాయి. అంటే విజేతకు మన కరెన్సీలో 13 కోట్లు అందుతాయి. కానీ మన ఐపీఎల్ 2022 లో విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు 20 కోట్లు అనేవి అందిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

తిరువనంతపురంలో బౌలింగ్ పించ్ వెనుక కారణాలు తెలుసా..?

ప్రపంచ కప్ లో హైదరాబాదీ పేసర్ కు అవకాశం..!

Visitors Are Also Reading