Home » కోహ్లీకి ఐసీసీ ట్రిబ్యూట్..!

కోహ్లీకి ఐసీసీ ట్రిబ్యూట్..!

by Azhar
Ad

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యంత జనాదరణ పొందిన క్రికెటర్ అనే విషయం అందరికి తెలిసిందే. కానీ గత ఏడాది నుండి ఫామ్ కోల్పోయిన కోహ్లీ.. పని అయ్యిపోయింది అని కామెంట్స్ చేసిన అందరికి గత నెలలో జరిగిన ఆసియా కప్ ద్వారా తానేంటో చూపించాడు. మూడేళ్ళుగా అందుకోలేకపోయిన సెంచరీని కూడా.. విరాట్ ఆసియా కప్ లో అందుకున్నాడు.

Advertisement

ఇక అప్పటి నుండి మంచి ప్రదర్శన అనేది చేస్తున్న విరాట్ కోహ్లీ.. ఈ నెలలో ప్రారంభం అయిన ప్రపంచ కప్ లో ఎలా రాణిస్తాడు అని అందరూ అనుకున్నారు. అయితే ఈరోజు పాకిస్థాన్ తో ప్రపంచ కప్ లో జరిగిన తొలి మ్యాచ్ లోనే విరాట్ కోహ్లీ తన సత్తా అనేది చూపించాడు. కీలక వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులో ఉన్న విరాట్ పాండ్యతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు.

Advertisement

అలాగే క్రీజులో నేను ఉన్నాను అనే నమ్మకం ఫ్యాన్స్ కు కలిగేలా సిక్స్ లు కొడుతూ.. ఇండియాను గెలిపించాడు విరాట్. ఇక కోహ్లీ ఆడిన ఈ అద్భుతమైన నాక్ కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ స్వయంగా ట్రిబ్యూట్ అనేది ప్రకటించింది. కోహ్లీ ఫోటోను అద్భుతంగా రాజు మాదిరి ఎడిట్ చేసి.. కింగ్ ఇస్ బ్యాక్.. టేక్ ఏ బావ్ అంటూ పోస్ట్ చేసింది. ఇక ఐసీసీ పోస్ట్ చేసిన ఆ ఫోటో అనేది కోహ్లీ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి :

ఎలా ఆడాలో పాకిస్థాన్ కు కోహ్లీ నేర్పించాడు..!

పాకిస్థాన్ దుమ్ము దులిపి రికార్డు క్రియేట్ చేసిన విరాట్..!

Visitors Are Also Reading