Home » జబర్దస్త్ కు హైపర్ ఆది గుడ్ బై…?

జబర్దస్త్ కు హైపర్ ఆది గుడ్ బై…?

by Azhar
Ad

తెలుగు ప్రజలను 8 ఏళ్ళ నుండి కడుపుబ్బా నవిస్తున్న కార్యక్రమం జబర్దస్త్. 2013 లో ప్రారంభమైన ఈ షో ఎంతో మందికి జీవితాన్ని… ఇండస్ట్రీకి ఎంతో మంచి కామెడియన్లను ఇచ్చింది. దీనికి పోటీగా ఎన్ని కొత్త షోలు వచ్చిన.. అవి రెండు, మూడు నెలల కంటే ఎక్కువ రోజులు నిలవలేదు. కానీ ఇప్పుడు తాజా పరిస్థితులు చూస్తుంటే… ఈ షో కూడా మరెన్నో రోజులు నడుస్తుంది అని అనిపించడం లేదు. అందుకు కారణాలు కూడా లేకపాలేదు.

Advertisement

బుల్లితెరపై గ్రాండ్ సక్సెస్ అయిన ఈ షోకి మొదట్లో నాగబాబు, రోజా జడ్జ్ లుగా ఉండేవారు. ఆ తర్వాత నాగబాబు ఈ షో ను నుండి తప్పుకోగా… రోజా ఒక్కతే షోను లాక్కుంటూ వచ్చింది. మధ్యలో ఎంత మంది జడ్జ్ లను మార్చిన ఎవరు నాగబాబు స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు. ఇక ఇప్పుడు రోజా కూడా ఈ షో నుండి వెళ్ళిపోతుంది. తాజాగా ఏర్పాటు చేసిన ఏపీ సీఎం క్యాబినెట్ లో రోజాకు స్థానం దక్కడంతో ఆవిడ అన్ని షోలకు గుడ్ బై చెప్పేసింది.

Advertisement

ఇదిలా ఉంటె… రోజా కంటే ముందే హైపర్ ఆది కూడా జబర్దస్త్ కు టాటా చెప్పినట్లు తెలుస్తుంది. ఈ మధ్య షోలో మంచి స్కిట్లు లేకపోయినా… జబర్దస్త్ ను ఆది.. ఎక్ట్రా జబర్దస్త్ ను సుధీర్ నడుపుతూ వచ్చారు. కానీ గత మూడు వారాలుగా జబర్దస్త్ లో ఆది కనిపించడం లేదు. ఒకవేళ ఏ సినిమా కోసం అయిన ఆయన బయటకు వెళ్లాడా అంటే.. జబర్దస్త్ మినహా మిగిలిన అన్ని షోలలో కనిపిస్తున్నాడు. దాంతో ఆది రోజా కంటే ముందే జబర్దస్త్ కు గుడ్ బై చెప్పినట్లు వార్తలు వస్తుండటంతో.. ఈ షో ఇంకా ఎన్నో రోజులు నడవదు అని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

ధోని ముందే హెలికాప్టర్ షాట్ ఆడిన సిరాజ్..!

ఐపీఎల్లో టాప్ 5 రిచెస్ట్ టీమ్ ఓనర్‌లు వీరే..!

Visitors Are Also Reading