Home » బంగారం లాంటి భార్య‌ను ఇంట్లో పెట్టుకుని భ‌ర్త పాడుప‌నులు…త‌ట్టుకోలేక భార్య ఏం చేసిందంటే..?

బంగారం లాంటి భార్య‌ను ఇంట్లో పెట్టుకుని భ‌ర్త పాడుప‌నులు…త‌ట్టుకోలేక భార్య ఏం చేసిందంటే..?

by AJAY
Ad

ప్ర‌స్తుత కాలంలో వివాహేత‌ర సంబంధాలు పెరిగిపోతున్నాయి. భ‌ర్త ఉండ‌గానే భార్య మ‌రొక‌రితో సంబంధం పెట్టుకోవ‌డం…భార్య ఉండ‌గానే భ‌ర్త మ‌రొక‌రితో సంబంధం పెట్టుకోవ‌డం కామ‌న్ అయిపోయింది. అయితే వాటి వల్ల గొడ‌వ‌లు కూడా పెరిగి విడాకుల‌కు దారితీస్తున్నాయి. అంతే కాకుండా కొన్ని కేసుల్లో చంప‌డం లేదంటే బ‌ల‌వ‌న్మ‌రానికి పాల్ప‌డ‌టం కూడా జ‌రుగుతున్నాయి.

Advertisement

తాజాగా అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి జ‌రిగింది. ఇంట్లో బంగారం లాంటి భార్య‌ను పెట్టుకుని భ‌ర్త పాడుప‌నులు చేశాడు. అది తట్టుకోలేక భార్య బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. వివ‌రాల్లోకి వెళితే…ఈ ఘ‌ట‌న బెంగుళూరులో చోటు చేసుకుంది. బెంగుళూరుకు చెందిన అభిషేక్ కు శ్వేత 27 ఏళ్లు తో ప‌ద‌కొండు నెల‌ల క్రితం వివాహం జ‌రిగింది.

Advertisement

వీరిద్ద‌రూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కావ‌డంతో విలాస‌వంత‌మైన జీవితాన్ని గ‌డుపుతున్నారు. ఇద్ద‌రూ ఐటీలో టాప్ కంపెనీల‌లో ప‌నిచేస్తున్నారు. అయితే అభిషేక్ కు పెళ్లికి ముందే ఓ యువ‌తితో సంబంధం ఉంది. కానీ పెళ్లి త‌ర‌వాత కూడా మాజీ ప్రియురాలితో సంబంధాన్ని కొన‌సాగిస్తున్నాడు. ఈ విష‌యం శ్వేత‌కు తెలియ‌డంతో ఇంట్లో గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. అప్ప‌టి నుండి త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ‌. ప‌లుమార్లు పెద్ద‌ల స‌మ‌క్షంలో రాజీ చేసుకున్నారు.

అయిన‌ప్ప‌టికీ అభిషేక్ లో మార్పు రాలేదు. ప్రియురాలితో సంబంధాన్ని కొన‌సాగిస్తూ వ‌చ్చాడు. అయితే త‌న భ‌ర్త ప‌రాయి స్త్రీతో సంబంధం పెట్టుకోవ‌డం శ్వేత త‌ట్టుకోలేక‌పోయింది. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఉరివేసుకుని చ‌నిపోయింది. దాంతో అల్లుడిపై శ్వేత త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Visitors Are Also Reading