Home » పాకిస్తాన్ లో కూడా మేజర్ తగ్గడం లేదుగా..!

పాకిస్తాన్ లో కూడా మేజర్ తగ్గడం లేదుగా..!

by Azhar
Ad

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గురించి భారతీయుల ఎప్పటికి మరిచిపోరు. 26/11 ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ప్రాణం విడిచాడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. అయితే ఈయన జీవిత కథ ఆధారంగా మేజర్ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. తెలుగు హీరో అడవి శేష్ ఇందులో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో కనిపించాడు. అయితే జూన్ 3 వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. హిందీలో కూడా ఈ సినిమాకు బాగానే ఆదరణ అనేది లభించింది.

Advertisement

అయితే ఈ సినిమా విడుదల అయిన నెల రోజుల తర్వాత జులై 3న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇండియాలో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ కూడా టాప్ లో కొనసాగుతుంది. అదే విధంగా పాకిస్థాన్ లో కూడా ఈ సినిమా ఓ రేంజ్ లో దూసుకెళ్లడం అనేది గమనార్హం. అయితే పాక్ ఉగ్రవాదులు ముంబైలో దాడి చేయడంపైనే ఈ సినిమా అనేది వచ్చింది. మాములుగా అయితే ఇలాంటి సినిమాల పై పాకిస్థాన్ లో వ్యతిరేకత వస్తుంది. కానీ ఈ సినిమాను మాత్రం అక్కడ జనాలు ఆదరిస్తున్నారు.

Advertisement

మన ఇండియన్ సినిమాలు పాకిస్థాన్ లో థియేటర్ విడుదల ఎక్కువగా కావు. కానీ ఓటీటీలో మాత్రం ఈ సినిమాలు అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన మేజర్ పాకిస్థాన్ లో ట్రేండింగ్ లో నడుస్తుంది. ఇప్పటివరకు పాకిస్థాన్ లో అత్యధిక వ్యూస్ వచ్చిన ఇండియన్ సినిమాగా మేజర్ అనేది నిలిచింది. అయితే మహేష్ బాబు ప్రొడక్షన్ లో వచ్చిన ఈ సినిమా వాసవి శేష్ కెరియర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.

ఇవి కూడా చదవండి :

కోహ్లీని తప్పించండి అంటున్న కపిల్ దేవ్…!

కోహ్లీ పరుగులు చెయ్యాలా.. అయితే ఇలా చెయ్యండి..!

Visitors Are Also Reading