Home » సబ్బులు, సర్ఫ్ లు లేనప్పుడు బట్టలు ఎలా ఉతికేవారు? ఇంట్ర‌స్టింగ్ ఆర్టిక‌ల్!

సబ్బులు, సర్ఫ్ లు లేనప్పుడు బట్టలు ఎలా ఉతికేవారు? ఇంట్ర‌స్టింగ్ ఆర్టిక‌ల్!

by Azhar
Ad

130 సంవత్సరాల క్రితం లీబర్ బ్రదర్స్ అనే ఇంగ్లాండ్ కు చెందిన కంపెనీ తొలిసారిగా సబ్బును భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఆ త‌ర్వాత నార్త్ వెస్ట్ సోప్ అనే కంపెనీ 1897లో మీరట్‌లో సబ్బుల కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. మ‌రి ఈ కంపెనీల స‌బ్బులు రాక‌ముందు మ‌న‌వాళ్లు బ‌ట్టలు ఎలా ఉతికేవారు? స్నానాలు ఎలా చేసేవారు? త‌మ బ‌ట్ట‌ల‌, శ‌రీరాల మురికిని ఎలా వ‌దిలించుకునేవారో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం!

బ‌ట్ట‌లుత‌క‌డం కోసం :
స‌బ్బుల కంటే ముందు బ‌ట్ట‌లుత‌క‌డం కోసం కుంకుడు కాయ‌ల ర‌సం ఉప‌యోగించేవారు. రాజులు , ధ‌న‌వంతులు త‌మ ఇండ్ల‌లో కుంకుడు చెట్ల‌ను పెంచేవారు. కుంకుడు కాయ‌ల ర‌సాన్ని ఉప‌యోగించి దానితో నురుగొచ్చేలా చేసి ఆ నురుగుతో త‌మ‌ ఖరీదైన బట్ట‌లను ఉతికించేవారు.

Advertisement

Advertisement

సామాన్యులు బ‌ట్టులుతికే విధానం :
సాధార‌ణ జ‌నాలు బ‌ట్ట‌లుత‌క‌డం కోసం వేడినీళ్లు వాడేవారు. మురికి బ‌ట్ట‌ల‌ను వేడినీళ్ల‌లో వేసి అనంత‌రం రాళ్ల‌తో బాదుతూ ఉతికేవారు. త‌ర్వాతి రోజుల్లో పొలాల్లో, న‌దుల్లో దొరికే తెల్ల‌టి మ‌ట్టితో కూడా బ‌ట్ట‌లుతికేవారు. ఆ రోజుల్లో కుంకుడు కాయ‌లు ధ‌నవంతుల‌కే ప‌రిమితం.

ఇసుక + రెహ్ అనే ఖ‌నిజం :
అప్ప‌ట్లో బ‌ట్ట‌ల‌ను ఇసుక‌తో కూడా ఉతికేవారు. ఇసుక‌తో పాటు రెహ్ అనే ఒక ర‌క‌మైన ఖ‌నిజాన్ని వాడేవారు. దీనిలో సోడియం సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్ మరియు కాల్షియం సల్ఫేట్ ఉంటాయి ఇవి బ‌ట్ట‌కు అంటిన మురికిని తొల‌గిస్తాయి.

స్నానం చేయడానికి మట్టి:
సబ్బు రాకముందు బురద మ‌రియు బూడిదను శరీరంపై పూసుకుని స్నానం చేసేవారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పాత్రలను శుభ్రం చేయడానికి బూడిదను ఉపయోగిస్తారు.

Visitors Are Also Reading