Home » ఆర్టీసీ నెంబర్ ప్లేట్‌పై ‘Z’ అక్షరం ఎందుకు ఉంటుందో తెలుసా?

ఆర్టీసీ నెంబర్ ప్లేట్‌పై ‘Z’ అక్షరం ఎందుకు ఉంటుందో తెలుసా?

by Bunty
Ad

రెండు తెలుగు రాష్ట్రాలలో ఆర్టీసీ బస్సులు చాలా విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. నష్టాల్లో ఉన్నప్పటికీ రెండు ప్రభుత్వాలు ఆర్టీసీని ప్రజల కోసం కొనసాగిస్తున్నాయి. ఇది పక్కకు పెడితే.. హైదరాబాద్ ను ఒకప్పుడు నిజామ్స్ పరిపాలించారని మనకు తెలిసిన విషయమే. 1932 సమయంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ కు నిజంగా ఉండేవాళ్లు. ఆయన తల్లి పేరు జహ్రాబేగం.

READ ALSO : బాలయ్య తన కూతుర్లని ఎందుకు హీరోయిన్స్ చేయలేదో తెలుసా..?

Advertisement

ఆయన హయాంలోనే ఆర్టీసీ బస్సు రవాణా ప్రారంభించారు. ప్రారంభంలో ఆర్టీసీ బస్సులు సంఖ్య 22 మాత్రమే ఉండేదట. అప్పుడు బస్సు నంబర్లు HYZ అని మొదలయ్యేది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన తల్లి మీద ఉన్న ప్రేమతో ముందు తన తల్లి పేరుతోనే బస్సు సేవలను ప్రారంభించాలని అనుకున్నారట. కానీ అలా ఒక వ్యక్తి పేరుతో పబ్లిక్ వాహనాలు నడవకూడదు అని ప్రభుత్వం చెప్పడంతో తన తల్లి పేరులోని మొదటి అక్షరాన్ని బస్సు నంబర్ ప్లేట్ లపై రాయించారు. తర్వాత సంవత్సరాలు గడిచిన అదే కొనసాగుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా కూడా ఆ అక్షరాన్ని పెట్టడానికి గల కారణాన్ని అధికారులు గౌరవిస్తూ అది అలాగే ఉంచేశారు.

Advertisement

అలా రెండు రాష్ట్రాల్లో బస్సు సేవలు మొదలైనప్పటి నుండి ఆర్టీసీ బస్సులన్నీ Z సిరీస్ తోనే రిజిస్టర్ అవుతున్నాయి. ముందు నుంచి బస్సు నంబర్లలో Z అక్షరం ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ శాఖ వాళ్లకి ఆ అక్షరం ఎందుకు ఉందో తెలియదు. 1989 లో వారికి ఈ కారణం తెలిసింది అని చెప్పారు. కానీ ఇలా Z అక్షరం పెట్టడం మాత్రం కేవలం ప్రభుత్వ వాహనాలకే పరిమితమైంది. అద్దెకి తీసుకున్న వాహనాలకి లేదా ప్రైవేట్ బస్సులకు ఈ అక్షరం ఉండదు. ప్రభుత్వం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ తో ఎటువంటి ఒప్పందం చేసుకోకపోయినా, తల్లి మీద ఉన్న గౌరవంతో Z అక్షరం పెట్టడం కొనసాగిస్తూ వచ్చారు.

read also : కాంతార సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించిన నటి ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading