Home » ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రుల పైన కేసులు పెట్టిన హీరోయిన్స్ ఎవరంటే..?

ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రుల పైన కేసులు పెట్టిన హీరోయిన్స్ ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఎంత స్టార్ హీరో హీరోయిన్ అయినా సరే వారి వ్యక్తిగత జీవితంలో సమస్యలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. కుటుంబం అంటే ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు వెళ్లడం చాలా కష్టం.. అది ఒక ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే ఈ సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి.. అయితే ఇది స్టార్ హోదాలో ఉన్నవారికి వస్తే మాత్రం అది ఈజీగా బయటకు వస్తుంది.. దీంతో వారు రోడ్డున పడే అవకాశం ఉంటుంది.. అయితే ఈ సమస్యను వారు నాలుగు గోడల మధ్య పరిష్కారం చేసుకోవాలి తప్ప కోర్ట్ వరకు వెళితే మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి.. అయితే ఈ హీరోయిన్స్ మాత్రం ఇలాంటి పని చేశారు. ఆస్తుల కోసం సొంత తల్లిదండ్రుల పైన కేసులు పెట్టి కోర్టు మెట్లు ఎక్కారు.. మరి ఇంతకీ ఆ కథానాయిక ఎవరో తెలుసుకుందాం..

ఖుష్బూ :

Advertisement

ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెచ్చుకుంది. ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రుల పైన కేసు పెట్టింది.. ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే తనకు తండ్రి లేడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఈ విషయం అప్పట్లో చాలా హాట్ టాపిక్గా మారింది.
వనిత విజయ్ కుమార్ :

Advertisement

ఈ కథానాయిక కూడా ఆస్తుల కోసం తమ తల్లిదండ్రుల పై కేసు వేసింది. తన తల్లి మరణించాక తండ్రి విజయ్ కుమార్ పై కోర్టులో కేసు వేసింది.. దీనికి ప్రధాన కారణం ఆయన ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వకపోవడంతో ఇలా చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
సంగీత:


అప్పట్లో స్టార్ హీరోయిన్ గా పేరు పొంది ఊపేసిన నటి సంగీత. ఇటీవల ఆచార్య సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించింది . డబ్బులు సంపాదించడం కోసమే తన తల్లిదండ్రులు ఆమెను హీరోయిన్ గా చేసి తన జీవితం నాశనం చేశారని చాలాసార్లు చెప్పుకొచ్చింది. ఈమె కూడా ఆస్తిపాస్తుల కోసం తమ తల్లిదండ్రులపై కేసులు వేసింది.

ALSO READ:

Visitors Are Also Reading