Home » ఒక‌ప్ప‌టి హీరోయిన్ శాంతిప్రియ జీవితంలో ఇంత విషాదం ఉందా..? భ‌ర్త చ‌నిపోవ‌డంతో..!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ శాంతిప్రియ జీవితంలో ఇంత విషాదం ఉందా..? భ‌ర్త చ‌నిపోవ‌డంతో..!

by AJAY
Ad

ఒక‌ప్ప‌డు స్టార్ హీరోయిన్ లు రానించిన చాలా మంది ముద్దుగుమ్మ‌లు ప్ర‌స్తుతం సినిమాను వ‌దిలేశారు. అంతే కాకుండా సినిమాల‌తో సంబంధం లేకుండా గ‌డుపుతున్నారు. అలాంటి హీరోయిన్ ల‌లో శాంతిప్రియ కూడా ఒక‌రు. హీరోయిన్ భాను ప్రియ చెల్లెలిగా శాంతిప్రియ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యారు.

Advertisement

మ‌హ‌ర్షి సినిమాతో శాంతి ప్రియ అభిమానుల‌ను సంపాదించుకున్నారు. శాంతి ప్రియ తెలుగుతో పాటూ త‌మిళ చిత్రాల‌లోనూ న‌టించి అభిమానుల‌ను సంపాదించుకున్నారు. తెలుగులో మ‌హ‌ర్షి సినిమాతో పాటు ర‌క్త‌కన్నీరు, సింహం స్వ‌ప్నం, శిలాశాస‌నం, జ‌స్టిస్ రుద్ర‌మ‌దేవి లాంటి సినిమాల‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. అంతే కాకుండా బాలీవుడ్ లో అక్ష‌య్ కుమార్ జోడీగా సుగంద్ అనే సినిమాలో న‌టించారు. ఆ త‌ర‌వాత బాలీవుడ్ లోనూ కొన్ని సినిమాలు చేశారు. ఈ క్ర‌మంలోనే శాంతిప్రియ సిద్దార్థ్ రాయ్ ని వివాహం చేసుకున్నారు. కాగా 2004లో సిద్దార్థ్ రాయ్ గుండె పోటుతో మ‌ర‌ణించ‌డంతో శాంతిప్రియ జీవితంలో పెను విశాదం చోటు చేసుకుంది.

Advertisement

దాంతో భ‌ర్త చ‌నిపోయిన త‌ర‌వాత ఏడేళ్ల పాటూ శాంతిప్రియ సినిమాల‌కు పూర్తిగా దూరంగా ఉన్నారు. అయితే 2011 లో ఆమె మ‌ళ్లీ తెర‌పై క‌నిపించి రీఎంట్రీ ఇచ్చారు. మిథున్ చ‌క్ర‌వ‌ర్తి త‌నయుడు అక్ష‌య్ న‌టించిన హామిల్డ‌న్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చినా కూడా ఆ సినిమా అనుకున్న‌మేర విజ‌యం సాధించ‌లేదు. ఈ సినిమా త‌ర‌వాత శాంతిప్రియ కు పెద్ద‌గా అవ‌కాశాలు కూడా రాలేదు. దాంతో ప్ర‌స్తుతం శాంతిప్రియ సినిమాల‌కు దూరంగానే ఉంటున్నారు.

Visitors Are Also Reading