Home » గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోయిన క‌మ‌లిని ముఖర్జీ…ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా..?

గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోయిన క‌మ‌లిని ముఖర్జీ…ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా..?

by AJAY
Ad

టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయిన అంద‌మైన భామ‌ల్లో క‌మలిని ముఖ‌ర్జీ కూడా ఒక‌రు. ఈ ముద్దుగుమ్మ ఆనంద్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది. ఈ సినిమాతోనే క‌మ‌లిని టాలీవుడ్ కు ప‌రిచ‌యం కాగా మొద‌టి సినిమాతోనే ప్రేక్ష‌కుల‌ను త‌న మాయ‌లో ప‌డేసుకుంది. ఈ సినిమా త‌ర‌వాత మ‌ళ్లీ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలోనే గోదావ‌రి సినిమాలో న‌టించింది. ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధించింది.

Advertisement

ఇదిలా ఉంటే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన గమ్యం సినిమాలో కూడా క‌మ‌లిని హీరోయిన్ గా న‌టించింది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ హిట్ లు ప‌డ‌టంతో వ‌రుస ఆఫ‌ర్ లు అందుకుంది. ఇక హీరోయిన్ గా గుడ్ బై చెప్పిన త‌ర‌వాత హ్యాపిడేస్, జ‌ల్సా సినిమాల‌లో గెస్ట్ అపీయ‌రెన్స్ ఇచ్చింది. చివ‌ర‌గా రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన గోవిందుడు అంద‌రివాడేలే సినిమాలో ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించింది.

Advertisement

అయితే ఆ త‌ర‌వాత క‌మ‌లినీ మ‌ళ్లీ స్క్రీన్ పై మెర‌వ‌లేదు. ఇక సినిమాల‌కు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ అమెరికాలో ఉంటున్న‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా సినిమాల‌కు దూరం అయిన‌ప్పటికీ వ్యాపారంలో రానిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే డ‌ల్లాస్ లో జ‌రిగిన ఓ ఈవెంట్ లో క‌మ‌లిని మెరిసింది.

కాగా దానికి సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఆ ఫోటోల‌లో క‌మ‌లినిని చూస్తే అస్స‌లు గుర్తుప‌ట్ట‌లేరు. బ్లూ క‌ల‌ర్ డ్రెస్ లో ర్యాంప్ వాక్ చేస్తూ న‌వ్వుతూ న‌డిచివ‌స్తుంది. అయితే ఒక‌ప్పుడు స్లిమ్ గా అందంగా క‌నిపించిన ముద్దుగుమ్మ ఇప్పుడు కాస్త బొద్దుగా త‌యాయ్యింది. దాంతో క‌మ‌లిని ఇలా మారిపోయిందేంటి అని షాక్ అవుతున్నారు.

ALSO READ:  వైజాగ్‌లో స్థలం కొన్న చిరంజీవి..ఆ స్థలం కోసం పోటీ పడి, అన్ని కోట్లు పోశారా !

Visitors Are Also Reading