Home » క్యాన్సర్ నుంచి కోలుకున్న తరువాత హీరోయిన్ హంసానందిని ఎలా మారిపోయిందో చూశారా..?

క్యాన్సర్ నుంచి కోలుకున్న తరువాత హీరోయిన్ హంసానందిని ఎలా మారిపోయిందో చూశారా..?

by Anji
Ad

సినీ పరిశ్రమలోని చాలామంది తారలు క్యాన్సర్ బారిన పడిన విషయం విధితమే. వారిలో మనీషా కొయిరాలా, సోనాలి బింద్రే, మమతా మోహన్ దాస్ వంతి స్టార్ హీరోయిన్స్ క్యాన్సర్ బారి నుంచి కోలుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీరిలో టాలీవుడ్ హీరోయిన్ హంసానందిని కూడా ఒకరు. అనుమానస్పదం అనే సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే ఈ బ్యూటీ క్యాన్సర్ బారిన పడింది.

Advertisement

కొన్ని సంవత్సరాలుగా చికిత్స తీసుకుంటున్న హంసానందిని ఇటీవలే క్యాన్సర్ మహమ్మారిని జయించినట్టుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది. ఇక ఇప్పుడు హైదరాబాదులో అడుగు పెట్టింది హీరోయిన్. తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హంస నందిని లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. తాజాగా షేర్ చేసిన ఫోటోల్లో ఇదివరకు అంటే చాలా అందంగా కనిపిస్తోంది అంశానందిని.

Advertisement

రెండేళ్ల కిందట తనకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని పోస్ట్ చేసింది. ఆమె తల్లి కూడా క్యాన్సర్ తోనే మరణించిందని.. చిన్నప్పటి నుంచే అందాకారంలో పెరిగానని.. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని చెప్పారు. అన్ని కష్టాలన్నీ ఎదుర్కొన్నట్టుగానే ఈ క్యాన్సర్ సమస్యను కూడా జయించి మళ్లీ కం బ్యాక్ అవుతానని చెప్పుకొచ్చింది. హంసానందిని చెప్పినట్టుగానే ఆత్మవిశ్వాసంతో క్యాన్సర్ని జయించి ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. ఈమె కాజా ఫోటోలను చూసి నేటిజన్లో ఆశ్చర్యపోతున్నారు. తనకు మద్దతు తెలుపుతూ కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు.

Also Read :  పవన్ కళ్యాణ్ వల్ల ఉద్యోగం కోల్పోయిన అషు రెడ్డి.. వైరల్ గా మారిన పోస్ట్..!

Visitors Are Also Reading