Home » తండ్రి మృతి పై హీరో నిఖిల్ ఎమోషనల్…కన్నీళ్లు పెట్టిస్తున్న పోస్ట్….!

తండ్రి మృతి పై హీరో నిఖిల్ ఎమోషనల్…కన్నీళ్లు పెట్టిస్తున్న పోస్ట్….!

by AJAY
Ad

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్ధార్థ నిన్న అనారోగ్యంతో మరణించారు. దాంతో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. కాగా తాజాగా నిఖిల్ తన తండ్రి మృతి పై ఎమోషన్ అయ్యారు. నిఖిల్ తన సోషల్ మీడియాలో….. మా నాన్న శ్యామ్ సిద్ధార్థ నిన్న మరణించడం నాకు ఎంతో బాధ కలిగించింది. ఆయన ఓ మంచి వ్యక్తి… వేలాది మంది విద్యార్థులకు మార్గనిర్దేశం చేశాడు. విద్యాబుద్ధులను నేర్పించాడు.

Advertisement

చాలామందికి కెరీర్లో మార్గ నిర్దేశం చేశాడు. అంతే కాకుండా తన చుట్టూ ఉన్న ప్రజలను సంతోషపరిచేందుకు నా తండ్రి ఎప్పుడూ తన వంతు కృషి చేసే వాడు. మహానటులు ఎన్టీరామారావు, ఏఎన్ఆర్ లను విపరీతంగా అభిమానించే వారు. నన్ను ఏదో ఒక రోజు వెండితెరపై చూడాలన్నదే ఆయన కోరిక మరియు ఆయన సపోర్ట్ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఒక అబ్బాయి నుండి తనకు తానుగా చదువుకోడానికి వచ్చి మాకు మంచి జీవితాన్ని అందించడానికి నిరంతరం పని చేసేవాడు.

Advertisement

జెఎన్టియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నుండి స్టేట్ టాపర్ గా నిలిచి తన కష్టాన్ని మాత్రమే నమ్ముకొని ఈ స్థాయికి వచ్చాడు. ఆయన కష్టానికి ఫలితాలు వచ్చిన సమయంలోనే అరుదైన వ్యాధి బారిన పడ్డారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఆ వ్యాధితో పోరాడారు. కానీ నిన్న తుది శ్వాస విడిచారు. నాన్న మీరు ఎక్కడ ఉన్నా మీ ఆత్మకు శాంతి లభిస్తుందని ఆశిస్తున్నాను.

NIKHIL

NIKHIL

నాన్న నేను నిన్ను ప్రేమిస్తున్నాను… చాలా మిస్ అవుతున్నాం. మీ గురించి ఆలోచించకుండా ఒక రోజు కూడా గడవదు. మా క్రాస్ రోడ్ సినిమా, బిర్యానీ ఔటింగ్, లాంగ్ డ్రైవ్ లు, ముంబైలో సమ్మర్ వీటన్నింటిని చాలా మిస్ అవుతాం. నేను మీ కొడుకుగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. మనం మళ్ళీ కలుస్తామని ఆశిస్తున్నాను. మీ నిక్కీ నాన్న…. అంటూ నిఖిల్ తన సోషల్ మీడియా పోస్ట్ లో ఎమోషనల్ అయ్యారు.

ALSO READ :

త్రిష నుండి మహేష్ బాబు వరకు ఆచార్య ను మిస్ చేసుకున్న 5గురు స్టార్స్ ఎవరో తెలుసా..!

ACHARYA MOVIE REVIEW : ఆచార్య రివ్యూ అండ్ రేటింగ్ ..!

Visitors Are Also Reading