Home » 100 కోట్ల ల‌గ్జ‌రీ హెలికాప్ట‌ర్ కొన్న మొద‌టి భార‌తీయుడు.. దీని స్పెష‌ల్ ఏమిటంటే..?

100 కోట్ల ల‌గ్జ‌రీ హెలికాప్ట‌ర్ కొన్న మొద‌టి భార‌తీయుడు.. దీని స్పెష‌ల్ ఏమిటంటే..?

by Anji
Ad

వంద కోట్ల విలువ క‌లిగిన ల‌గ్జ‌రీ హెలికాప్ట‌ర్ కొనుగోలు చేసిన మొట్ట‌మొద‌టి భారతీయుడిగా నిలిచారు ర‌విపిళ్లై. ఈయ‌న కేర‌ళ‌కు చెందిన ఆర్‌పీ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మ‌న్ బీ.ర‌విపిళ్లై 100 కోట్ల విలువైన ఎయిర్ బ‌స్ హెచ్‌-145 హెలికాప్ట‌ర్‌ను కొనుగోలు చేశారు. ఇంత ల‌గ్జ‌రీ చాప‌ర్‌ను సొంతం చేసుకున్న మొద‌టి భార‌తీయుడిగా పిళ్లై నిలిచారు. ప్ర‌స్తుతం, ప్ర‌పంచ వ్యాప్తంగా కేవ‌లం 1,500 హెచ్ 145 చాప‌ర్లు మాత్ర‌మే తిరుగుతున్నాయి. కాగా.. మార్చి 20 ఆదివారం రోజు ఈ హెలికాప్ట‌ర్‌లో ఆర్‌పీ గ్రూప్స్ వైస్ చైర్మ‌న్ కోవ‌లం నుంచి ది ర‌విజ్ అష్ట‌ముడి ఫైవ్‌స్టార్ హోట‌ల్ వ‌ర‌కు ప్ర‌యాణించారు.

Advertisement

Advertisement

68 ఏళ్ల బిలియ‌నీర్ బీ. ర‌వి పిళ్లై సంద‌ప విలువ ప్ర‌స్తుతం $2.5 బిలియ‌న్ డాల‌ర్లు. ర‌విపిళ్లైకి చెందిన వివిధ కంపెనీల‌లో సుమారు 70వేల మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నారు. ఆయ‌న యూఏఈ నుంచి కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హిస్తున్నారు.

హెచ్‌-145 హెలికాప్ట‌ర్ అత్యాధునిక భ‌ద్ర‌తా ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంటుంది. ఇందులో ఫైలెట్‌తో పాటు ఏడుగురు ప్ర‌యాణికులు ప్ర‌యాణించ‌వ‌చ్చు. ఈ హెలికాప్ట‌ర్ స‌ముద్ర మ‌ట్టానికి 20వేల అడుగుల ఎత్తు నుంచి కూడా ల్యాండింగ్‌, టేకాఫ్ చేయ‌గ‌ల‌దు.

Also Read :  23rd march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Visitors Are Also Reading